Johnson and Yusuf Pathan: యూసుఫ్ పఠాన్, మిచెల్ జాన్సన్ ఢీ అంటే ఢీ

క్రికెట్ లో ప్రత్యర్థి ఆటగాళ్ళ మధ్య మాటల యుద్ధం.. అప్పుడప్పుడు అదుపు తప్పు ఉద్రిక్త వాతావరణం నెలకొనడం చూస్తూనే ఉంటాం.

  • Written By:
  • Publish Date - October 3, 2022 / 05:30 PM IST

క్రికెట్ లో ప్రత్యర్థి ఆటగాళ్ళ మధ్య మాటల యుద్ధం.. అప్పుడప్పుడు అదుపు తప్పు ఉద్రిక్త వాతావరణం నెలకొనడం చూస్తూనే ఉంటాం. కొన్న సార్లు ఒకరినొకరు తోసుకోవడం కూడా జరుగుతుంది. తాజాగా లెజెండ్స్ లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. బిల్వారా కింగ్స్‌, ఇండియా క్యాపిటల్స్‌ మధ్య సెమీఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో యూసఫ్‌ పఠాన్‌, మిచెల్‌ జాన్సన్‌ గొడవ పడ్డారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగి కొట్టుకునేదాకా వెళ్లిపోయారు. అంపైర్‌తో పాటు మిగతా ఆటగాళ్లు తలదూర్చి వారిని విడదీయాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

​మిచెన్‌ జాన్సన్‌ బౌలింగ్‌ పఠాన్‌ బౌండరీలు బాదాడు. అయితే ఓవర్‌ ముగిసిన తర్వాత మిచెల్‌ జాన్సన్‌ పఠాన్‌పై నోరు పారేసుకున్నాడు. తాను ఏం తక్కువ తినలేదంటూ యూసఫ్‌ పఠాన్‌ కూడా జాన్సన్‌ను కౌంటర్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో పఠాన్‌ జాన్సన్‌ వైపు దూసుకొచ్చాడు. అయితే జాన్సన్‌ పఠాన్‌ను తోసేశాడు. ఇక గొడవ తారాస్థాయికి చేరిందన్న క్రమంలో అంపైర్‌ తలదూర్చి జాన్సన్‌ను పక్కకి తీసుకెళ్లారు. ఆ తర్వాత కూడా ఇద్దరు ఎక్కడా తగ్గలేదు.

ఇరుజట్ల కెప్టెన్లు, అంపైర్ల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. అయితే 48 పరుగులు చేసిన యూసఫ్‌ పఠాన్‌ మిచెల్‌ జాన్సన్‌ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఇండియా క్యాపిటల్స్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బిల్వారా కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా క్యాపిటల్స్‌ 19.3 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది.