Legends League Cricket: లెెజెండ్స్ క్రికెట్ లీగ్ లో ఆడేది వీళ్ళే

దిగ్గజ క్రికెటర్లు అందరూ మళ్ళీ అభిమానులను అలరించేందుకు రెడీ అయ్యారు.

  • Written By:
  • Updated On - September 3, 2022 / 05:25 PM IST

దిగ్గజ క్రికెటర్లు అందరూ మళ్ళీ అభిమానులను అలరించేందుకు రెడీ అయ్యారు. క్రికెట్ ఫ్యాన్స్ కోసం సిద్ధమైన లెజెండ్స్ క్రికెట్ లీగ్ సెప్టెంబర్ 16 నుంచి షురూ కాబోతోంది. భారత మాజీ ఆటగాళ్ళు గంగూలీ, సెహ్వాగ్ , గంభీర్ , ఇర్ఫాన్ పఠాన్ ఇంకా పలు విదేశీ మాజీలు ఈ లీగ్ లో సందడి చేయనున్నారు. నాలుగు జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో కెప్టెన్లు, ప్లేయర్ల జాబితాను నిర్వాహకులు తాజాగా ప్రకటించారు. గుజరాత్ జెయింట్స్ టీమ్ కు కెప్టెన్ గా వీరేంద్ర సెహ్వాగ్, ఇండియా క్యాపిటల్స్ కు గౌతమ్ గంభీర్, బిల్వారా కింగ్స్ కు ఇర్ఫాన్ పఠాన్, మణిపాల్ టైగర్స్ టీమ్ కు హర్భజన్ సింగ్ సారథులుగా వ్యవహరించబోతున్నారు.

ఇండియా క్యాపిటల్స్ టీమ్ లో మోర్తాజా, మసకద్జ, ప్రవీణ్ తాంబే, మహారూఫ్, కలిస్ తో పాటు పలువురు క్రికెటర్లు ప్రాతినిథ్యం వహించబోతుండగా..బిల్వారా కింగ్స్ లో యూసఫ్ ఫఠాన్, నమన్ ఓజా, షేన్ వాట్సన్, శ్రీశాంత్, మణిపాల్ టైగర్స్ లో బ్రెట్ లీ, ముత్తయ్య మురళీధరన్, మహమ్మద్ కైఫ్, కలువితరణ, క్లుసెనర్, ఫ్లింటాఫ్ తో పాటు వివిధ దేశాలకు చెందిన ప్లేయర్లు ఆడనున్నారు. అటు గుజరాత్ టైటాన్స్ నుండి పార్థివ్ పటేల్, అజంతా మెండిస్, అశోక్ దిండా, ఓబ్రెయిన్, లెండి సిమ్మన్స్ తో పాటు పలువురు అంతర్జాతీయ క్రికెటర్లు బరిలోకి దిగబోతున్నారు.

లెజెండ్స్ లీగ్ లో భాగంగా సెప్టెంబర్ 16న ఇండియా మహారాజాస్, వరల్డ్ జెయింట్స్ మధ్య ప్రారంభ మ్యాచ్ జరుగనున్నది. లెజెండ్స్ లీగ్ టోర్నీకి లక్నో, ఢిల్లీ, కటక్, జోధ్ పూర్ ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. అయితే భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకున్న లీగ్ ఆరంభానికి ముందు ఛారిటీ మ్యాచ్ నిర్వహించనున్నాడు. ఈ మ్యాచ్ లో ఇండియా మహారాజాస్ , వరల్డ్ జెయింట్స్ టీమ్ తలపడనున్నాయి. ఇండియా మహారాజాస్ టీమ్ కు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరభ్ గంగూలీ , వరల్డ్ జెయింట్స్ టీమ్ కు ఇయాన్ మోర్గాన్ కెప్టెన్ గా నియమితుడయ్యాడు. వీరితో పాటు క్రిస్ గేల్,షేన్ వాట్సన్, బ్రెట్ లీ, డేల్ స్టెయిన్ వంటి మాజీ ఆటగాళ్ళు ఆడనున్నారు. ఈ మ్యాచ్ కు కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది.