Lasith Malinga: శ్రీలంక మాజీ ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ (Lasith Malinga) మళ్లీ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఫ్రాంచైజీకి చేరనున్నాడు. ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా అతను సేవలందించనున్నాడు. ఒక నివేదిక ప్రకారం.. ముంబై ఇండియన్స్ జట్టులో ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా షేన్ బాండ్ స్థానంలో లసిత్ మలింగ నియమితులు కానున్నట్లు తెలుస్తుంది. న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ షేన్ బాండ్ గత 9 సీజన్లలో జట్టుకు ప్రధాన కోచ్గా ఉన్నాడు. ముంబైతో బాండ్ ఒప్పందం ఇంకా సమీక్షలో ఉందని IPL మూలం ధృవీకరించింది. బాండ్తో ముంబై ఇండియన్స్ ఒప్పందం ఇంకా ముగియలేదని ఈ సోర్స్ తెలిపింది.
ILT20 (ఇంటర్నేషనల్ లీగ్ T20, UAE)లో MI ఎమిరేట్స్కు ప్రధాన కోచ్గా బాండ్ కొనసాగుతారా లేదా అనేది కూడా అస్పష్టంగా ఉందని ‘ESPN Cricinfo’ గతంలో నివేదించింది. ఈ లీగ్ ప్రారంభ సీజన్లో జట్టు మూడో స్థానంలో నిలిచింది. మలింగకు ముంబై జట్టుతో విడదీయలేని అనుబంధం ఉంది. ఆ ఫ్రాంచైజీ తరఫున అతను ఏకంగా ఐదు ట్రోఫీలు అందుకున్నాడు. 2013, 2015, 2017, 2019లో ముంబై ఐపీఎల్ విజేతగా నిలిచింది. అంతేకాదు 2011లో చాంపియన్స్ లీగ్ చాంపియన్గా అవతరించింది. ఈ ఫాస్ట్ బౌలర్ 139 మ్యాచ్లు ఆడి 195 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు డబుల్ హ్యాట్రిక్స్ ఉన్నాయి.
Also Read: World CUP 2023: డైమండ్ బ్యాట్ తో బరిలోకి కోహ్లీ
ముంబై తరఫున మలింగ 139 మ్యాచ్లు ఆడి 7.12 ఎకానమీ రేటుతో 195 వికెట్లు తీశాడు. ఇందులో 170 వికెట్లు ఐపీఎల్లోనే వచ్చాయి. ఈ లీగ్లో అత్యధిక వికెట్లు తీసిన జాయింట్ ఆరో బౌలర్. మలింగ ఇంతకుముందు 2018లో జట్టులో మెంటార్గా వ్యవహరించాడు. మలింగ 2021లో రిటైర్మెంట్ తర్వాత 2022లో రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్ పాత్రను పోషించాడు.