Kohli Says Sorry: రవీంద్ర జడేజాకు క్షమాపణలు చెప్పిన విరాట్ కోహ్లీ.. ఎందుకో తెలుసా..?

ఈ మ్యాచ్ విన్నింగ్ సెంచరీతో కోహ్లి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. విరాట్ ఈ అవార్డును స్వీకరించడానికి వచ్చినప్పుడు మొదట రవీంద్ర జడేజాకు క్షమాపణలు (Kohli Says Sorry) చెప్పాడు.

  • Written By:
  • Updated On - October 20, 2023 / 06:57 AM IST

Kohli Says Sorry: బంగ్లాదేశ్‌తో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌లో తన వన్డే కెరీర్‌లో 48వ సెంచరీని నమోదు చేశాడు విరాట్ కోహ్లీ. భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ప్రపంచ కప్‌లో పరుగులను ఛేదించే క్రమంలో మొదటిసారి 100 మార్క్‌ను దాటాడు. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బంగ్లాదేశ్ నిర్దేశించిన 257 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోహ్లి 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 103 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్ విన్నింగ్ సెంచరీతో కోహ్లి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. విరాట్ ఈ అవార్డును స్వీకరించడానికి వచ్చినప్పుడు మొదట రవీంద్ర జడేజాకు క్షమాపణలు (Kohli Says Sorry) చెప్పాడు. దీనికి కారణం ఏంటో కూడా చెప్పాడు. అవార్డు ప్రదానోత్సవం సందర్భంగా కోహ్లి ఇలా అన్నాడు. జడ్డూ నుండి అవార్డుని దొంగిలించినందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. కీలక సమయంలో లిట్టన్ దాస్, నజ్ముల్ వికెట్లు తీయడమే కాకుండా పొదుపుగా బౌలింగ్ చేసిన జడేజా అవార్డుకు అర్హుడనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశాడు కోహ్లీ.

Also Read: World Cup 2023: బంగ్లాదేశ్‌పై 7 వికెట్ల తేడాతో టీమిండియా విజయం

We’re now on WhatsApp. Click to Join.

తన సెంచరీ గురించి కోహ్లీ మాట్లాడుతూ.. నేను పెద్ద సహకారం అందించాలనుకుంటున్నాను. ప్రపంచకప్‌లో నేను కొన్ని అర్ధశతకాలు సాధించాను. కానీ నేను వాటిని సెంచరీలుగా మార్చలేకపోయాను. నేను ఈసారి ఆటను పూర్తి చేసి చివరి వరకు ఉండాలనుకున్నాను. అందుకు తగ్గినట్లే బ్యాటింగ్ చేశాను అని చెప్పాడు విరాట్. బంగ్లాదేశ్‌ను ఓడించడం ద్వారా భారత్ 2023 ప్రపంచకప్‌లో వరుసగా నాలుగో విజయాన్ని సాధించింది. జట్టు జోరు చాలా బాగుందని, ఆటగాళ్లలో కూడా సానుకూల వాతావరణం ఉందని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

2023 ప్రపంచకప్‌లో 17వ మ్యాచ్‌లో పూణె వేదికగా జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్‌ను భారత జట్టు ఓడించింది. విరాట్ కోహ్లి అజేయ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. పరుగుల వేటలో కోహ్లి 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో 103* పరుగులు చేశాడు. దీనికి గాను కోహ్లీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు.