Kohli Gets Very Emotional: ఆ ఇన్నింగ్స్ ఎప్పటికీ మరిచిపోలేను.. కోహ్లీ ఎమోషనల్ పోస్ట్..!

టీ ట్వంటీ ప్రపంచకప్ లో పాకిస్థాన్ పై భారత విజయాన్ని అభిమానులు మరిచిపోలేరు.

  • Written By:
  • Publish Date - November 26, 2022 / 04:52 PM IST

టీ ట్వంటీ ప్రపంచకప్ లో పాకిస్థాన్ పై భారత విజయాన్ని అభిమానులు మరిచిపోలేరు. ఆ మ్యాచ్ లో కోహ్లీ , పాండ్యా జట్టును గెలిపించారు. తాజాగా ఆ విజయాన్ని గుర్తు చేసుకుంటూ కోహ్లీ ఎమోషనల్ అయ్యాడు. ఇన్ స్టా గ్రామ్ వేదికగా అతను చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అక్టోబర్ 23, 2022 నాకు ప్రత్యేకమైన రోజు. ఇది ఎప్పటికీ నా గుండెలో ఉండిపోతుంది. ఈ మ్యాచ్‌లో నాకు ఉన్న ఎనర్జీ ఇంతకుముందు ఎప్పుడూ లేదు. ఇది నాకు మాత్రమే దక్కిన అదృష్టవంతమైన సాయంత్రం’ అంటూ విరాట్ పేర్కొన్నాడు. దీనికి అందరికి ధన్యవాదాలు అనే ఏమోజి‌తో పాటు ఆ మ్యాచ్ అనంతరం మైదానం వీడుతున్న తన ఫొటోను జత చేశాడు.

ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో అసాధారణ ఇన్నింగ్స్‌తో టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్నందించాడు. ముఖ్యంగా ఈ మ్యాచ్ 19వ ఓవర్‌ చివరి రెండు బంతులకు విరాట్ కోహ్లీ కొట్టిన రెండు సిక్సర్లు అత్యద్భుతమైనవిగా చరిత్రకెక్కాయి. క్రికెట్ అభిమానులే కాదు చాలా మంది మాజీ క్రికెటర్లు విరాట్ ఆడిన ఈ ఇన్నింగ్స్‌ను ప్రత్యేకంగా అభినందించారు. క్రికెట్ చరిత్రలోనే మరుపరాని ఇన్నింగ్స్ అంటూ కొనియాడారు. మెగా టోర్నీ అనంతరం విశ్రాంతి తీసుకున్న విరాట్.. న్యూజిలాండ్ పర్యటనకు దూరంగా ఉన్నాడు. డిసెంబర్ 4 నుంచి బంగ్లాదేశ్‌తో జరిగే టెస్ట్‌ సిరీస్‌తో విరాట్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు.