DC UNVEIL: ఢిల్లీ కాపిటల్స్ కొత్త జెర్సీ చూసారా ?

ఐపీఎల్‌-2022 సీజన్‌ కోసం అన్ని ఫ్రాంచైజీల సన్నాహాలు ఊపందుకున్నాయి.

  • Written By:
  • Updated On - March 12, 2022 / 10:54 PM IST

ఐపీఎల్‌-2022 సీజన్‌ కోసం అన్ని ఫ్రాంచైజీల సన్నాహాలు ఊపందుకున్నాయి. ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు సరికొత్త జెర్సీలో కనిపించనున్నారు. ఇందుకు సంబందించిన కొత్త జెర్సీలను ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ట్విటర్‌ వేదికగా విడుదల చేసింది… ‘నయా ఢిల్లీకి నయా జెర్సీ’ అనే పేరుతో ఈ వీడియోను పోస్ట్‌ చేశారు. ఇక బ్లూ, రెడ్‌ కలర్‌తో కూడిన జెర్సీ అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ జెర్సీ మధ్యలో గర్జిస్తున్నట్లుగా ఉన్న పులి ఫోటో ఆకట్టుకుంటోంది. ఇక ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కొత్త జెర్సీని చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ క్రమంలోనే జెర్సీపై ప్ర‌శంసంల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం రిషబ్ పంత్ సేన కొత్త జెర్సీ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఇదిలాఉంటే ఐపీఎల్ -2022 మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. వాంఖడే వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తలపడనుంది. ఇక ఐపీఎల్ 2022 సీజన్ లో టైటిల్ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2022 మెగా వేలంలో స్టార్ ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేసింది. టీమిండియా ఫాస్ట్ బౌల‌ర్ శార్దుల్‌ ఠాకూర్‌ను ఢిల్లీ 10.75 కోట్లకు కొనుగోలు చేయగా.. అత‌డితో పాటు ఆస్ట్రేలియా ఆల్ రౌండ‌ర్ మిచెల్ మార్ష్‌ను రూ.6. 50 కోట్లకు, డేవిడ్ వార్న‌ర్‌ను రూ.6. 25 కోట్ల‌కు సొంతం చేసుకుంది. ఢిల్లీ క్యాపిటిల్స్ జ‌ట్టు మొత్తం 24 మంది ఆట‌గాళ్లు ఉండగా.. అందులో 17 మంది భారత క్రికెటర్లు, 7 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. వీరి కోసం మెగవేలంలో ఢిల్లీ క్యాపిటిల్స్ రూ. 89.50 కోట్లు వెచ్చించింది.