IND vs ZIM: భారత్లో ప్రస్తుతం ఐపీఎల్ సందడి నెలకొంది. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా తదుపరి టీ20 సిరీస్ను బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత జట్టు ఈ సిరీస్ ఆడనుంది. దీని కోసం టీమ్ ఇండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. భారత్- జింబాబ్వే మధ్య ఈ సిరీస్ జూలై 23న ప్రారంభం కానుంది. ఈ సిరీస్లోని అన్ని మ్యాచ్లు హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరగనున్నాయి. ఆ తర్వాత 2027 జనవరి నెలలో జింబాబ్వే జట్టు వన్డే సిరీస్ ఆడేందుకు భారత్కు రానుంది.
సూర్యకుమార్ సారథ్యంలోనే జట్టు!
టీమ్ ఇండియా ఇటీవల టీ20 ప్రపంచకప్ 2026 టైటిల్ను కైవసం చేసుకుంది. గత ఏడాది సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత జట్టు తన టైటిల్ను కాపాడుకుంది. ఈ పర్యటనలో కూడా అతనే జట్టు కెప్టెన్గా వ్యవహరించే అవకాశం ఉంది. టీమ్ ఇండియా పర్యటనలో మొదటి మ్యాచ్ జూలై 23న, రెండో మ్యాచ్ జూలై 25న, మూడో మ్యాచ్ జూలై 26న జరగనుంది. ఈ పర్యటనలో యువ భారత జట్టు బరిలోకి దిగే అవకాశం ఉంది. మేనేజ్మెంట్ కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇచ్చేలా కనిపిస్తోంది.
Also Read: పెట్రోల్ ధరలపై కేంద్రం కీలక ప్రకటన..!
2024లో జింబాబ్వే పర్యటన
గత కొంతకాలంగా టీమ్ ఇండియా ప్రతి ఏడాది జింబాబ్వే పర్యటనకు వెళ్తోంది. భారత జట్టు షెడ్యూల్ను గమనిస్తే గత 4 ఏళ్లలో ఇది జింబాబ్వేలో జట్టుకు మూడవ పర్యటన. 2024లో శుభ్మన్ గిల్ సారథ్యంలో భారత జట్టు అక్కడ పర్యటించి 4-1తో సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్ తర్వాత వచ్చే ఏడాది జింబాబ్వే జట్టు మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడేందుకు భారత్కు రానుంది.
జింబాబ్వేతో భారత్ టీ20 షెడ్యూల్
- 23 జూలై (గురువారం) – మొదటి టీ20 (హరారే స్పోర్ట్స్ క్లబ్)
- 25 జూలై (శనివారం) – రెండో టీ20 (హరారే స్పోర్ట్స్ క్లబ్)
- 26 జూలై (ఆదివారం) – మూడో టీ20 (హరారే స్పోర్ట్స్ క్లబ్)
