India vs South Africa: భారత్-దక్షిణాఫ్రికా మధ్య (India vs South Africa) సెంచూరియన్ టెస్టు మ్యాచ్ ప్రారంభం కాకముందే అభిమానులకు బ్యాడ్ న్యూస్ వచ్చింది. సెంచూరియన్ టెస్ట్ మ్యాచ్ కోసం టాస్ మధ్యాహ్నం 1.30 గంటలకు జరగాల్సి ఉంది. అయితే టాస్ ఆలస్యమైంది. ఈ విషయాన్ని బీసీసీఐ స్వయంగా వెల్లడించింది. ఇప్పుడు ఈ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ని చూసేందుకు అభిమానులు మరికొంత సమయం వేచి చూడాల్సిందే. భారత్-దక్షిణాఫ్రికా మధ్య మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. ఇప్పుడు మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది.
The toss and start of the 1st Test between South Africa and India have been delayed due to wet patches on the outfield.
Further inspection at 10:00 AM (1.30 PM IST)#SAvIND
— BCCI (@BCCI) December 26, 2023
Also Read: Team India Schedule: 2024లో టీమిండియా ఫుల్ బిజీ.. పూర్తి షెడ్యూల్ ఇదే..!
టాస్ ఎందుకు ఆలస్యం..?
సెంచూరియన్ టెస్టులో వర్షం ముప్పు పొంచి ఉంది. భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో ఇప్పటికే వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం వర్షం పడకపోయినా.. అవుట్ఫీల్డ్ తడి కారణంగా టాస్ ఆలస్యమైంది. టాస్ ఎప్పుడు నిర్వహిస్తారు..? మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసుకోవడానికి మధ్యాహ్నం 1.30 గంటలకు తనిఖీ చేయనున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఔట్ఫీల్డ్ తడి కారణంగా నిన్న కూడా టీమ్ ఇండియా ప్రాక్టీస్ అసంపూర్తిగా ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అభిమానుల నిరీక్షణ ఎప్పుడు ముగుస్తుందో..? మ్యాచ్ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.
We’re now on WhatsApp. Click to Join.