Mohammed Siraj : సిరాజ్ కు ఘనస్వాగతం పలికిన హైదరాబాద్ అభిమానులు

శంషాబాద్ విమానాశ్రయంకు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకొని.. భారత్ మాతాకీ జై అనే నినాదాల మధ్య స్వాగతం పలికారు

  • Written By:
  • Publish Date - July 5, 2024 / 11:24 PM IST

T20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) విజేత మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) కు హైదరాబాద్ అభిమానులు (Hyderabad Fans) ఘనస్వాగతం పలికారు. 2024 T20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ఆట తీరును కనపరిచి..కప్ గెల్చుకున్న టీం ఇండియా కు స్వదేశంలో ఘన స్వాగతం లభించిన సంగతి తెలిసిందే. గురువారం ఉద‌యం ప్రధాని మోడీని కలిసిన భార‌త జ‌ట్టు ఆట‌గాళ్లు..అనంత‌రం ప్ర‌త్యేక విమానంలో ముంబైకి చేరుకున్నారు. ముంబై వీధుల్లో ఓపెన్ టాప్ బ‌స్‌లో రోడ్ షో చేసి అభిమానులను అలరించారు. రోడ్ షో అనంత‌రం ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో భార‌త ఆట‌గాళ్ల‌ను బీసీసీఐ సన్మానించింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈరోజు మహమ్మద్ సిరాజ్‌ హైదరాబాద్‌ కు చేరుకోగా ఆయనకు ఘన స్వాగతం పలికారు అభిమానులు. శంషాబాద్ విమానాశ్రయంకు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకొని.. భారత్ మాతాకీ జై అనే నినాదాల మధ్య స్వాగతం పలికారు. అనంతరం సిరాజ్ మాట్లాడుతూ.. టీ-20 ప్రపంచ కప్ గెలవడం హైదరాబాద్​కు గర్వకారణమని అన్నారు. 11 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు ఇది మరిచిపోని రోజు అని గుర్తు చేశారు. తాను కూడా క్రికెట్ టీమ్​కు చాలా కష్టపడుతున్నానని, ఇంకా కష్టపడి రానున్న రోజుల్లో ఇండియాకు మరిన్ని పథకాలు సాధించే విధంగా కృషి చేస్తానని తెలిపారు.

Read Also : CBN : చంద్రబాబు కు ఘనస్వాగతం పలికిన తెలుగు తమ్ముళ్లు