Hardik Pandya: పాండ్యాకు ఘోర అవమానం

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ చరిత్రలో విజయవంతమైన జట్టు ఏది అంటే ముంబై ఇండియన్స్ పేరే చెప్తారు. ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ అనగానే గుర్తుకు వచ్చేది రోహిత్ శర్మ పేరే. జట్టును ఐదు సార్లు ఛాంపియన్ గా

Hardik Pandya: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ చరిత్రలో విజయవంతమైన జట్టు ఏది అంటే ముంబై ఇండియన్స్ పేరే చెప్తారు. ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ అనగానే గుర్తుకు వచ్చేది రోహిత్ శర్మ పేరే. జట్టును ఐదు సార్లు ఛాంపియన్ గా నిలబెట్టిన ఘనత రోహిత్ కె దక్కింది. 2013లో ముంబయి ఇండియన్స్ సారథ్య బాధ్యతలు అందుకున్న రోహిత్ తొలి సీజన్‌లోనే టైటిల్ అందించి తానేంటో నిరూపించుకున్నాడు. 11 సీజన్‌లలో సారథ్యం వహించి అందులో 5 సార్లు తన జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టాడు.

ముంబయి ఇండియన్స్‌ జట్టు తరఫున 163 మ్యాచులకు సారథ్యం వహించగా 91 మ్యాచుల్లో ముంబయి గెలుపొందింది. 68 మ్యాచుల్లో ఓడిపోయింది. నాలుగు మ్యాచుల్లో ఫలితం రాలేదు. రోహిత్ సారథ్యంలో ముంబయి 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో టైటిల్ విజేతగా నిలిచింది. అసలు ముంబయి ఇండియన్స్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరగడానికి ప్రధాన కారణం రోహిత్ శర్మ అనే చెప్పాలి.కానీ ఇప్పుడు అదే ఫ్యాన్స్ ముంబై ఇండియన్స్ ను హేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. రోహిత్ శర్మను ముంబయి ఇండియన్స్ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించడంపై ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ఐదు సార్లు కప్ అందించిన వీరుడికి మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదే క్రమంలో హార్దిక్ పాండ్యను కూడా వదలట్లేదు. హార్దిక్ ను కట్టప్పతో పోలుస్తున్నారు.

ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్‌గా నియ‌మితుడైన త‌రువాత హార్దిక్ పాండ్య తొలి సారి బ‌య‌ట క‌నిపించాడు. ముంబై ఎయిర్ పోర్ట్‌లో హార్దిక్ ను చుసిన రోహిత్ శర్మ అభిమానులు ట్రోల్స్ కు పాల్పడ్డారు. ముంబైకా రాజా రోహిత్ శర్మ. అంటూ గట్టిగా నినాదాలు చేశారు. ఆ టైం లో పాండ్య కామ్ గా వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాండ్యాకు ఇంతకంటే ఘోర అవమానం ఇంకోటి ఉండదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఏదీ ఏమైన‌ప్ప‌టికీ ఇలా చేయ‌డం సరికాద‌ని అంటున్నారు టీమిండియా ఫ్యాన్స్. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Also Read: Balakrishna: రాజకీయాల్లో బాలయ్య బిజీబిజీ.. గెలుపు వ్యూహాలపై గురి!