హనుమాన్ ఆలయంలో ట్రోఫీకి పూజలు చేయించిన గంభీర్, సూర్య

T20 World Cup  అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. నిన్న జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల భారీ తేడాతో ఓడించి వరుసగా రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. దీంతో టీ20 ప్రపంచకప్ చరిత్రలో టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇచ్చి టైటిల్ గెలిచిన తొలి జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. ఈ విజయం తర్వాత భారత జట్టు సభ్యులు తమ సంతోషాన్ని వినూత్నంగా పంచుకున్నారు. మ్యాచ్ ముగిసి, మీడియా సమావేశాలు పూర్తయిన […]

Published By: HashtagU Telugu Desk
Hanuman Temple

Hanuman Temple

T20 World Cup  అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. నిన్న జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల భారీ తేడాతో ఓడించి వరుసగా రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. దీంతో టీ20 ప్రపంచకప్ చరిత్రలో టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇచ్చి టైటిల్ గెలిచిన తొలి జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. ఈ విజయం తర్వాత భారత జట్టు సభ్యులు తమ సంతోషాన్ని వినూత్నంగా పంచుకున్నారు.

మ్యాచ్ ముగిసి, మీడియా సమావేశాలు పూర్తయిన కొన్ని గంటల్లోనే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ఐసీసీ ఛైర్మన్ జై షా.. గెలిచిన ప్రపంచకప్ ట్రోఫీని నేరుగా నరేంద్ర మోదీ స్టేడియం పక్కనే ఉన్న హనుమాన్ టేక్రీ ఆలయానికి తీసుకెళ్లారు. అక్కడ ఆంజనేయ స్వామి పాదాల చెంత ట్రోఫీని ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీస్సులు తీసుకున్నారు.

ఈ తుది పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, నిర్ణీత ఓవర్లలో 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో జస్ప్రీత్ బుమ్రా అద్భుత బౌలింగ్‌తో చెలరేగడంతో న్యూజిలాండ్ జట్టు కేవలం 159 పరుగులకే కుప్పకూలింది. 2024 నుంచి 2026 మధ్య కాలంలో భారత జట్టుకు ఇది వరుసగా మూడో ఐసీసీ టైటిల్ కావడం విశేషం. ఈ విజయంతో భారత జట్టు ప్రపంచ క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది.

  Last Updated: 09 Mar 2026, 09:54 AM IST