కామన్వెల్త్ గేమ్స్ లో తొలి రోజు మిక్స్డ్ బ్యాడ్మింటన్ ఈవెంట్ లో పాకిస్థాన్ ను భారత్ 5-0 తేడాతో ఓడించింది. గ్రూప్ ఏలో భాగంగా జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో భారత స్టార్ ప్లేయర్ల్ సింధు, శ్రీకాంత్ సింగిల్స్ లో రాణించడంతో భారత్ పై చేయి సాధించింది.తొలి మ్యాచ్ లో డబుల్ ప్లేయర్స్ అశ్వినీ పొన్నప్ప, సుమిత్ రెడ్డి 21-9 21-12 తేడాతో విజయాన్ని సాధించి ఇండియాకు 1-0 ఆధిక్యాన్ని అందించారు.
ఆ తర్వాత కిదాంబి శ్రీకాంత్ 21-7 21-12 తేడాతో మురాద్ అలీని ఓడించాడు. మూడో మ్యాచ్ లో స్టార్ ప్లేయర్ సింధు దూకుడైన ఆటతో మహూర్ షెహజాద్ ను బెంబేలేత్తించింది. 21-7 21-6 తేడాతో మహూర్ పై సింధు విజయాన్ని సాధించింది. ఆ తర్వాత జరిగిన రెండు డబుల్స్ మ్యాచ్ లలో సాత్విక్, చిరాగ్ శెట్టి, త్రిష జాలీ, గాయత్రి గోపిచంద్ జోడి విజయాల్ని అందుకోవడంలో 5-0 తేడాతో పాకిస్థాన్ ను క్లీన్ స్వీప్ చేసింది.మిక్స్డ్ బ్యాడ్మింటన్ ఈవెంట్ లో తర్వాత మ్యాచ్ లలో శ్రీలంక, ఆస్ట్రేలియాలతో భారత జట్టు తలపడనుంది.
#CommonwealthGames | In Badminton,
* India beat Pakistan by 3-0 in opening group stage match of mix team event
* PV Sindhu beat Pakistan's Mahoor Shahzad 21-7 21-6
* Kidambi Srikanth beat Pak's Murad Ali 21-7 21-12
* Ashwini Ponappa/Sumeeth Reddy beat Pak pair 21-9 21-12 pic.twitter.com/1IyxMi7KVA
— ANI (@ANI) July 29, 2022