Site icon HashtagU Telugu

T20 World Cup: ఇదేం ఖర్మరా నాయనా బంగ్లా చేతిలో ఆసీస్ సెమీస్ బెర్త్

T20 World Cup

T20 World Cup

T20 World Cup: టీ ట్వంటీ వరల్డ్ కప్ సెమీఫైనల్ స్టేజ్ కు ముందు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే మూడు బెర్తులు ఖరారయ్యాయి. గ్రూప్ 1 నుంచి విజయాలతో భారత్ అజేయ జట్టుగా సెమీస్ కు చేరింది. గ్రూప్ 2 నుంచి సౌతాఫ్రికా మూడు మ్యాచ్ లూ గెలిచి సెమీస్ లో అడుగుపెడితే… ఇదే గ్రూప్ లో రెండో జట్టుగా ఇంగ్లాండ్ సెమీస్ చేరింది. ఇక ఒకే ఒక సెమీస్ బెర్త్ మిగలగా రేసులో మూడు జట్లు నిలిచాయి, గ్రూప్ 1 లో ఆస్ట్రేలియా , ఆఫ్ఘనిస్తాన్ , బంగ్లాదేశ్ రేసులో ఉన్నాయి. వీటిలో ఆసీస్, ఆప్ఘనిస్తాన్ రెండేసి పాయింట్లతో ఉండగా.. బంగ్లాదేశ్ ఖాతానే తెరవలేదు. రన్ రేట్ పరంగా మాత్రం ఆప్ఘనిస్తాన్ కంటే కంగారూలు మెరుగైన స్థితిలో ఉన్నారు.

అయితే ఆసీస్ కు షాకిచ్చిన ఆప్ఘనిస్తాన్ తమ చివరి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై గెలిస్తే 4 పాయింట్లతో సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. అదే జరిగితే కంగారూలు టోర్నీ నుంచి సూపర్ 8 స్టేజ్ లోనే నిష్క్రమిస్తారు. ఇక బంగ్లాదేశ్ కు కూడా ఛాన్స్ ఉన్నా… అద్భుతం జరగాలి. ఆ జట్టు నార్మల్ గా గెలిస్తే ఆసీస్ కు సెమీస్ బెర్త్ దక్కుతుంది. అదే 62 పరుగుల కంటే ఎక్కువ తేడాతో ఆప్ఘనిస్తాన్ గెలిస్తే బంగ్లాదేశ్ కు సెమీస్ అవకాశాలు ఉంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ ఫామ్ చూస్తే బంగ్లాదేశ్ పై గెలవడం పెద్ద కష్టం కాదని చెప్పొచ్చు. అయితే సంచలనాలకు మారుపేరుగా ఉండే టీ ట్వంటీలో ఏదైనా జరగొచ్చు. మొత్తం మీద వరల్డ్ క్రికెట్ లో టాప్ టీమ్ గా ఉన్న ఆసీస్ భవితవ్యం బంగ్లాదేశ్ చేతిలో ఉండడం ఆశ్చర్యమే.

Also Read: Hyderabad: రాత్రి 11 గంటల తర్వాత బయటకు వెళ్తున్నారా..!

Exit mobile version