YS Avinash Reddy: అవినాష్ రెడ్డికి సునీత రెడ్డి షాక్..

అవినాష్ రెడ్డి బెయిల్ పై సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి మధ్యంతర బెయిల్ ను సుప్రీంకోర్టులో

YS Avinash Reddy: అవినాష్ రెడ్డి బెయిల్ పై సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి మధ్యంతర బెయిల్ ను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు సునీత రెడ్డి. ఈ మేరకు సునీత రెడ్డి పిటిషన్ పై రేపు శుక్రవారం విచారిస్తామని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్య కేసుపై రోజుకొక వార్త హల్చల్ చేస్తుంది. వివేకానంద రెడ్డి హత్యలో సొంత వ్యక్తుల ప్రమేయం ఉన్నట్టు ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు అరెస్టుల పరంపర కొనసాగుతుంది. ప్రస్తుతం వివేకా హత్య కేసు సీబీఐ హ్యాండిల్ చేస్తుంది. అందులో భాగంగా అనుమానితుల్ని ఒడిసి పడుతూ దూకుడు పెంచింది. ఇటీవల ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర రెడ్డిని సీబీఐ కస్టడీకి తీసుకుని విచారిస్తుంది. అయితే ఇదే కేసులో అవినాష్ రెడ్డిని కూడా సీబీఐ విచారిస్తుంది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారించిన హైకోర్టు ఈ నెల 25 వరకు అరెస్ట్ చేయొద్దంటూ సీబీఐని ఆదేశించింది. అయితే విచారణ నిమిత్తం 25వ తేదీ వరకు ప్రతిరోజు సీబీఐ ముందు హాజరవ్వాలంటూ అవినాష్ రెడ్డిని ఆదేశించింది హైకోర్టు. ఏదిఏమైనప్పటికీ 25 వరకు అవినాష్ రెడ్డి అరెస్ట్ పెండింగ్ లో ఉన్నట్టే. కాగా.. ఇదే విషయంపై వైఎస్ వివేకా కుమార్తె సునీత రెడ్డి సుప్రీం మెట్లెక్కింది. అవినాష్ రెడ్డి బెయిల్ కు వ్యతిరేకంగా ఆమె అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు రేపు సునీత రెడ్డి పిటిషన్ పై విచారణ చేపట్టనుంది సుప్రీం కోర్టు.

Read More: HBD CBN : మారిన సాయిరెడ్డి, అన్న‌య్య‌కు హ్వాపీ బ‌ర్త్ డే