కాకినాడ జిల్లాలో వైసీపీ నాయకులు ఓ వేడుకలో యువతలతో చిందులేశారు. ఏలేశ్వరం మండలం యర్రవరంకు చెందిన ఓ వ్యక్తి పుట్టినరోజు వేడుకలను గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో రికార్డింగ్ డాన్స్ తరహా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులను ఆహ్వానించి… యువతులతో నృత్యాలు ఏర్పాటు చేశారు.
ఈ వేడుకలో వైకాపా నాయకులు యువతులతో కలిసి నృత్యాలు చేశారు. వీటిని సామాజిక మాధ్యమాల్లో చూసిన సామాన్యులు ముక్కున వేలేసుకుంటున్నారు. రికార్డింగ్ డాన్సుల తరహాలో సాగిన నృత్యాలను పోలీసులు అడ్డుకోకపోవడమేంటని చర్చించుకుంటున్నారు.
Also Read: Sreeleela: ఛలో మూవీని మిస్ చేసుకొని, పెళ్లిసందడితో ఎంట్రీ ఇచ్చి!