Vastu And Wealth: పొరపాటున కూడా ఈ వస్తువులు మంచం మీద పెట్టకండి.. పెడితే ఊహించని నష్టాలు గ్యారెంటీ!

చాలామంది తెలిసి, తెలియకో కొన్ని రకాల వస్తువులను ఎక్కడపడితే అక్కడ పెడుతూ ఉంటారు. అలా మనం తెలిసి

  • Written By:
  • Publish Date - August 30, 2022 / 08:40 AM IST

చాలామంది తెలిసి, తెలియకో కొన్ని రకాల వస్తువులను ఎక్కడపడితే అక్కడ పెడుతూ ఉంటారు. అలా మనం తెలిసి తెలియక చేసే పనుల వల్ల వాస్తు దోషాలు తలెత్తడంతో పాటుగా ఆర్థిక నష్టాలు కూడా కలుగుతాయి అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే మంచం మీద కొన్ని రకాల వస్తువులను పెట్టడం వల్ల ఆర్థిక నష్టాలు వెంటాడుతాయట. మరి మంచం మీద ఎటువంటి వస్తువులు పెట్టకూడదు. పెడితే ఎటువంటి నష్టాలు జరుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మంచం పై కొన్ని రకాల వస్తువులను పెడితే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందట. అంతే కాకుండా లక్ష్మి ఇంటిని వీడి వెళ్ళిపోతుందట. మంచం మీద పెట్టకూడని వస్తువులలో పసుపు, కుంకుమలు చాలా ముఖ్యమైనవి.

పసుపు, కుంకుమ లను ఎట్టి పరిస్థితులలోనూ మంచం మీద పెట్టకూడదు. మంచం అనేది భోగ స్థానం కావడంతో మంచం మీద ఎప్పుడూ కూడా అత్యంత పవిత్రంగా భావించే పసుపు కుంకుమలను, పూజా సామాన్యులను,అలాగే పండ్లు, తమలపాకులను పెట్టకూడదని సూచిస్తున్నారు. అదేవిధంగా భగవంతునికి నైవేద్యం పెట్టడానికి తీసుకువచ్చిన పదార్థాలను కూడా మంచం మీద పెట్టకూడదు అని చెబుతున్నారు. అలా పెట్టడం వల్ల వాటిలో ఉండే దైవికమైన శక్తి నశించి, అవి మామూలు వస్తువులుగా మాత్రమే మిగిలి పోతాయని శాస్త్ర నిపుణులు తెలిపారు. అలా మంచం మీద పెట్టిన వాటిని ఆ తర్వాత మళ్లీ దేవుడికి నైవేద్యం పెట్టిన వాటి ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. అందుకే మంచం మీద ఎట్టిపరిస్థితుల్లోనూ భగవంతుడికి నివేదించడం కోసం తీసుకువచ్చిన పదార్థాలను, దేవుడి దగ్గర పెట్టే సామాన్లను పెట్టకూడదు.

అదేవిధంగా ముత్యాలను ఎప్పుడూ కూడా మంచం మీద పెట్టకూడదు. మంచం పై సాలగ్రామాలు, రుద్రాక్షలు ఎప్పుడూ పెట్టకూడదు. వీటితో పాటుగా వెండి ఆభరణాలు, బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలు కూడా మంచం పై పెట్టకూడదు. మరకత ఆభరణాలను కూడా మంచం మీద పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. మంచం పై ఇటువంటి వస్తువులను పెట్టడం వల్ల మన ఐశ్వర్యం అంతాకూడా హరించకు పోతుందట. అలాగే చాలామంది ఇళ్లల్లో బీరువాలో నుంచి బంగారు ఆభరణాలు బయటకు తీసిన తర్వాత వాటిని వెంటనే మంచం మీద పెట్టి చూసుకుంటారు. కానీ ఆ విధంగా చేయడం నష్టం చేకూరుస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మంచం మీద బంగారం పెట్టటం వల్ల మళ్లీమళ్లీ బంగారాన్ని కొనుగోలు చేయలేని పరిస్థితి ఆ కుటుంబ సభ్యులకు వస్తుందని, అది దోషానికి కారణంగా మారుతుందని చెబుతున్నారు. అదేవిధంగా చాలా మంది ఆంజనేయ స్వామి వంటి దేవుడి ఫోటోలను దిండు కింద పెట్టుకొని పడుకుంటూ ఉంటారు. ఉదయం లేవగానే దేవుడు ఫోటో చూసి ఆ తర్వాత పనులకు ఉపక్రమిస్తారు. అయితే మంచం మీద దిండు కింద దేవుడి ఫోటోలను పెట్టుకోవడం ఏ మాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. మంచం ఎప్పుడూ యోగ స్థానం కాదని, ఐశ్వర్య స్థానం కాదని, అది కేవలం భోగ స్థానం మాత్రమేనని చెబుతున్నారు. అందుకే మంచం మీద ఎట్టిపరిస్థితుల్లోనూ ఏ వస్తువులు పడితే ఆ వస్తువులు పెట్టకూడదు అని సూచిస్తున్నారు.