Odisha: దారుణం.. రెండు కిలోల టమోటాల కోసం పిల్లలను తాకట్టు పెట్టిన వ్యక్తి?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు టమాటాలు కొనుగోలు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. ఇంకా చెప్పాలి

  • Written By:
  • Publish Date - July 31, 2023 / 03:10 PM IST

ప్రస్తుతం దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు టమాటాలు కొనుగోలు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే టమాటా ధరలు చూసినా కొంతమంది దొంగల కళ్ళు ఎర్రబడుతున్నాయి. దీంతో ఎక్కడ చూసినా కూడా టమాటాలను దొంగతనం చేస్తున్నారు. వినడానికి కాస్త ఫన్నీగా ఉన్న ఇది నిజం. మొన్నటి వరకు టమాటాలకు సరైన గిట్టుబాటు లేకపోవడంతో రోడ్డు పక్కన కుప్పలు కుప్పలుగా పోసిన ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు టమాటా ధరలు మండిపోతుండడంతో దొంగలు విన్నంగా టమాటాలను దొంగతనం చేస్తున్నారు.

ఇప్పటికే చాలా ప్రదేశాలలో టమాటాలను దొంగతనం చేయడంతో పాటు టమాటాల కోసం చంపడానికి కూడా వెనకాడడం లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా కేవలం రెండు కిలోల టమాటాల కోసం పిల్లలను తాకట్టు పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఒడిశాలోని కటక్ లో చోటుచేసుకుంది. నందు కటక్ లోని చత్ర బజార్ కూరగాయల మార్కెట్లో కూర్చొని తన కూరగాయల దుకాణాన్ని ప్రతిరోజు లాగానే సర్దుకుంటున్నాడు. ఇంతలోనే ఒక వ్యక్తి ఇతర ఇద్దరు మహిళలు పిల్లలను తీసుకొని కస్టమర్ గా నటిస్తూ దుకాణానికి వెళ్ళాడు. నందుతో టమాటాలా బేరం కూడా కుదుర్చుకున్నాడు. టమాటా ధర కిలో రూ.135 నిర్ణయించారు. రెండు కిలోల టమాటాలు తీసుకున్న తర్వాత తాను ఇంకా పది కిలోలు కొంటాను అని దుకాణదారుడు నందుతో చెప్పాడు. కారు పర్సులో మరిచిపోయాను తీసుకుని వస్తా అప్పటివరకు మా పిల్లలను చూసుకో అనినందుకి చెప్పి సదరు వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

తండ్రి కోసం ఆ ఇద్దరు పిల్లలు ఆ దుకాణదారుడు వద్ద ఎదురుచూస్తూ ఉన్నారు. అతను ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో నందుకి అనుమానం వచ్చింది. దాంతో ఆ పిల్లలను నందు నిలదీయగా సదరు వ్యక్తి తనను మోసం చేసినట్లు నందు కి అర్థం అయింది. నందు ఆ పిల్లలు ఇద్దరినీ తన షాప్ లో కూర్చోబెట్టాడు. ఇక అప్పటికే సమీపంలోని దుకాణదారులు కూడా నందు వద్దకు చేరుకున్నారు. ఆ జనాలను చూసిన ఆ పిల్లలు ఇద్దరు ఏడవడం మొదలుపెట్టారు. వెంటనే వారు నివసిస్తున్న ప్రదేశం గురించి చెప్పారు. అంతేకాకుండా తమను ఆ వ్యక్తి ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారో కూడా తెలియదని అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా తమకు తెలియదు అని చెప్పడంతో నందు షాక్ అయ్యాడు. పని ఇప్పిస్తానని చెప్పి రూ. 300 ఇస్తానని చెప్పి ఇద్దరినీ అక్కడికి తీసుకు వచ్చినట్టు పిల్లలు నందుకు తెలిపారు. అయితే అదంతా తెలుసుకున్న నందు ఆ పిల్లలు ఇద్దరినీ వదిలి పెట్టేసాడు.