డిజిటల్ జర్నలిస్టులకు గుర్తింపు.. సోషల్ మీడియా ఛానెళ్లకు సాధికారత సాధించడమే లక్ష్యంగా పని చేస్తున్న TUOWJ మరొక చొరవ చూపింది. సినీ ఆర్టిస్టుల ప్రధాన వేదిక అయిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA)తో ఈ రోజు (జనవరి 17, 2022) భేటీ అయ్యింది. ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు, కోశాధికారి శివ బాలాజీ తో డిజిటల్ మీడియా విస్తృతి, YouTube ఛానెళ్లకు గుర్తింపు తదితర అంశాలపై ప్రాథమికంగా చర్చించింది.
తప్పుడు Thumbnails పెట్టేవారిపై కఠిన చర్యలు ఉండాలన్న తన విధానాన్ని మంచు విష్ణు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. అయితే, యూనియన్ తో చర్చించాకే చర్యలుంటాయని కూడా హామీ ఇచ్చారు. “మా సమావేశం సుహృద్భావ వాతావరణంలో బాగా జరిగింది. వివిధ అంశాలను కూలంకషంగా చర్చించాం. గాసిప్స్ రాస్తే తప్పు లేదు కానీ తప్పుడు భాషలో కుటుంబాల్ని రోడ్డుకీడ్చేవిధంగా ఉండే ఛానెళ్లను ఉపేక్షించేది లేదని విష్ణు స్పష్టం చేశారు. ఇది అర్థం చేసుకోతగినదే. మా వైపు నుంచి ‘మా’ కు సంపూర్ణ సహకారాలు ఉంటాయి,” అని బీ ఎస్ చెప్పారు.
డిజిటల్ మీడియా యూనియన్ గా తాము కూడా స్పష్టమైన విధివిధానాల్ని రూపొందించుకుని స్వయం నియంత్రణ పాటించేందుకు సిద్ధంగా ఉన్నామనీ, కలిసి పని చేయాలనుకుంటున్నామని చెప్పినట్లు బీ ఎస్ తెలిపారు. మరో సారి పూర్తి స్థాయిలో సమావేశమై విషయాలు చర్చించుకోవాలని ఉభయపక్షాలు నిర్ణయించాయి. ఇలాంటి సకారాత్మక చర్యలు సఫలం కావడానికి యూ ట్యూబర్స్, ఆన్ లైన్ జర్నలిస్టులు సహకరిస్తే బాగుంటుంది. ఈ విషయంలో పిచ్చి రాజకీయాలకు, కుళ్ళుబోతు వ్యవహారాలకు తావ్వివకుండా అంతా కలిసిపనిచేయాలని ఆశిద్దాం.
డిజిటల్ జర్నలిస్టులకు గుర్తింపు..

TUOWJ