Road Accident: సంగారెడ్డి జిల్లాలో లారీ బీభత్సం.. ముగ్గురు మృతి

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం (Road Accident) సంభవించింది. సంగారెడ్డి జిల్లా కొల్లూరు దగ్గర ఓఆర్‌ఆర్‌పై లారీ బీభత్సం సృష్టించింది. ఔటర్ రింగ్ రోడ్డు‌పై నుంచి అదుపుతప్పి లారీ గుడిసెలోకి దూసుకెళ్లింది.

Published By: HashtagU Telugu Desk
Mexico Bus Crash

Road accident

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం (Road Accident) సంభవించింది. సంగారెడ్డి జిల్లా కొల్లూరు దగ్గర ఓఆర్‌ఆర్‌పై లారీ బీభత్సం సృష్టించింది. ఔటర్ రింగ్ రోడ్డు‌పై నుంచి అదుపుతప్పి లారీ గుడిసెలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ పటాన్ చెరు నుంచి శంషాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.మృతులు ఓఆర్‌ఆర్ పక్కన చెట్లకు నీళ్లు పోసే కార్మికులుగా గుర్తించారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Also Read: Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో మరోసారి భూకంపం

  Last Updated: 02 Mar 2023, 09:00 AM IST