3 Killed : నాగ్‌పూర్‌లో అదృశ్య‌మైన ముగ్గురు చిన్నారులు.. రెండు రోజులు త‌రువాత‌..?

మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో అదృశ్య‌మైన ముగ్గురు చిన్నారులు శ‌వాలై క‌నిపించారు. నాగ్‌పూర్‌లో తమ ఇళ్లకు 50 మీటర్ల దూరంలో

  • Written By:
  • Publish Date - June 19, 2023 / 08:27 AM IST

మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో అదృశ్య‌మైన ముగ్గురు చిన్నారులు శ‌వాలై క‌నిపించారు. నాగ్‌పూర్‌లో తమ ఇళ్లకు 50 మీటర్ల దూరంలో ఉన్న ఎస్‌యూవీ వాహనంలో ముగ్గురు చిన్నారుల మృత‌దేహాల‌ను పోలీసులు గుర్తించారు. అదృశ్య‌మైన రెండు రోజుల త‌రువాత చిన్నారులు మృతదేహాల‌ను క‌నుగొన్నారు. ఫరూక్ నగర్‌కు చెందిన తౌఫిక్ ఫిరోజ్ ఖాన్ (4), అలియా ఫిరోజ్ ఖాన్ (6), అఫ్రీన్ ఇర్షాద్ ఖాన్ (6) శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో అదృశ్య‌మైన‌ట్లు పోలీసులు తెలిపారు. శనివారం సాయంత్రం వరకు వారు తిరిగి రాకపోవడంతో చిన్నారుల త‌ల్లిండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘ‌ట‌న‌పై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఆదివారం సాయంత్రం 7 గంటల సమయంలో ఒక కానిస్టేబుల్ వారి ఇళ్లకు సమీపంలో పార్క్ చేసి ఉన్న SUVని కనుగొన్నారు. ఆ కార‌రులో లోపల ముగ్గురు పిల్లల మృతదేహాలను కనుగొన్నారు.