Telangana : తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం..సంతాప తీర్మానాలతో తొలి రోజు

ఇటీవల మరణించిన ప్రజాప్రతినిధుల పట్ల గౌరవంగా సభలు నివాళులర్పించాయి. శాసనమండలిలో నూతనంగా ఎన్నికైన సభ్యులను మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి సభకు పరిచయం చేస్తూ వారి భవిష్యత్తు రాజకీయ ప్రస్థానానికి శుభాకాంక్షలు తెలిపారు.

Published By: HashtagU Telugu Desk
Telangana Legislative Assembly sessions begin..first day with resolutions of regret

Telangana Legislative Assembly sessions begin..first day with resolutions of regret

Telangana : తెలంగాణ రాష్ట్ర శాసనసభ మరియు శాసనమండలి సమావేశాలు శనివారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. నాలుగైదు రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు సూచించాయి. మొదటి రోజు సభలు సంతాప తీర్మానాలతో ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన ప్రజాప్రతినిధుల పట్ల గౌరవంగా సభలు నివాళులర్పించాయి. శాసనమండలిలో నూతనంగా ఎన్నికైన సభ్యులను మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి సభకు పరిచయం చేస్తూ వారి భవిష్యత్తు రాజకీయ ప్రస్థానానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సందర్భంలో, ఇటీవల మృతి చెందిన జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాసనసభలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

Read Also: KCR: అసెంబ్లీ సమావేశాలకు దూరంగా కేసీఆర్..

ఈ సందర్భంగా గోపీనాథ్‌ రాజకీయ జీవన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్న రేవంత్‌, విద్యార్థి ఉద్యమాల్లో ఆయన చురుకైన పాత్ర పోషించిన విషయాన్ని ప్రస్తావించారు. 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత అధ్యక్షుడిగా ఆయన సేవలందించారు. అప్పట్లో ఎన్టీఆర్‌ వారికి ఎంతో విశ్వాసపాత్రుడిగా భావించేవారు అని తెలిపారు. గోపీనాథ్‌ రాజకీయ నాయకుడిగా కాకుండా సినీ నిర్మాతగా కూడా గుర్తింపు పొందారని, ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్న అనుభవసంపన్న నాయకుడిగా ప్రశంసించారు. ఆయన తనకు మంచి మిత్రుడని, వ్యక్తిగతంగా కూడా ఎంతో సన్నిహితంగా మమేకమైన వ్యక్తిగా పేర్కొన్నారు.

ఇక, శాసనమండలిలో మాజీ సభ్యులు రత్నాకర్‌, రంగారెడ్డి మృతిపై సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టబడ్డాయి. సభ్యులంతా నివాళులర్పించిన అనంతరం సభలు కొద్దిసేపటికి వాయిదా పడ్డాయి. ఈ సమావేశాల్లో అసెంబ్లీ మరియు మండలిలో వేర్వేరు బీఏసీ (బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ) సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఈ సమావేశాల్లో సభలు ఎంత రోజుల పాటు నిర్వహించాలి, ఏయే అంశాలపై చర్చ జరపాలి అనే అంశాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక కూడా ఈ సమావేశాల వ్యవధిలోనే నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ సమావేశాలు రాష్ట్రపాలనపై కీలక చర్చలకు వేదికకావడం ఖాయం. ప్రజాసమస్యలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రతిపక్షాల ప్రశ్నలు, ప్రతిస్పందనలు రాజకీయ ఉత్కంఠను పెంచేలా ఉన్నాయి.

Read Also: PM Modi : జపాన్‌లో ప్రధాని మోడీ..బుల్లెట్ ట్రైన్ ప్రయాణం, రాష్ట్రాల స్థాయిలో కొత్త భాగస్వామ్యానికి శ్రీకారం

  Last Updated: 30 Aug 2025, 11:11 AM IST