తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. మల్లు స్వరాజ్యంకు సంతాపం ప్రకటించారు స్పీకర్. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. మల్లు స్వరాజ్యం తెలంగాణ సాయుధ పోరాటయోదురాలని కొనియాడారు. ఆమె సేవలు మరవలేనివన్నారు.
తర్వాత మల్లు స్వరాజ్యం, జనార్దన రెడ్డిలకు సంతానం తెలుపుతూ మౌనం పాటించింది సభ. అనంతరం సమావేశాలను 12 వ తేదీకి వాయిదా వేశారు. ఇక అసెంబ్లీకి చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎల్పీలో భేటీ అయ్యారు. సభను 20రోజుల పాటు జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.