Hyderabad: క్రికెట్ ఆడుతూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గుండెపోటుతో మృతి

ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా క్రికెట్ ఆడుతూ ఓ యువ టెక్కీ గుండెపోటుతో మృతి చెందాడు

Hyderabad: ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా క్రికెట్ ఆడుతూ ఓ యువ టెక్కీ గుండెపోటుతో మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్నం జిల్లా పెద్దగంట్యాడ మండలం మీంది గ్రామానికి చెందిన కాశిరెడ్డి సంజయ్ భార్గవ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తూ గచ్చిబౌలిలోని గౌలిదొడ్డిలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్నాడు.

స్నేహితులు దిలీప్, బాలప్రదీప్ అజయ్, తేజకిరణ్, ఆదిత్యలతో కలిసి ఘట్టుపల్లిలో క్రికెట్ ఆడుతుండగా తలనొప్పి రావడంతో ఆట మధ్యలో పక్కనే కూర్చోవాల్సి వచ్చింది. ఆ తర్వాత అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read: PM Modi Speech at Adilabad: ఇది ఎన్నికల సభ కాదు..ప్రగతి ఉత్సవాలు: ప్రధాని మోడీ