Site icon HashtagU Telugu

Sobhita- Naga Chaitanya: శ్రీశైలం మల్లన్న సేవలో శోభిత, నాగ చైతన్య

Sobitha Naga Chaitanya

Sobitha Naga Chaitanya

సినీనటుడు అక్కినేని నాగార్జున (Nagarjuna) తన కుటుంబంతో కలిసి శ్రీశైల మల్లన్నను దర్శించుకున్నారు. ఇటీవల నాగచైతన్య మరియు శోభిత (Naga Chaitanya-Sobhita) వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా, కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులతో కలిసి నాగార్జున కుటుంబ సభ్యులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా, స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. తర్వాత, అర్చకులు నూతన దంపతులకు వేదాశీర్వచనం పలికారు. తొలుత, ఆలయ మహాద్వారం వద్ద ఆలయ అధికారులు మరియు అర్చకులు వారికి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా తీసిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇక, నాగచైతన్య-శోభిత పెళ్లి ఫొటోలను ఇటీవల నాగార్జున తన ఎక్స్ ఖాతాలో పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా, మీడియాకు మరియు ఫ్యాన్స్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. “డియర్‌ ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ, ఫ్యాన్స్‌… మీ ప్రేమ, ఆశీస్సులు ఈ వేడుకను ప్రత్యేకం చేశాయి. ఈ అందమైన క్షణాల్లో మమ్మల్ని అర్థం చేసుకున్న మీడియాకు ధన్యవాదాలు. కృతజ్ఞతతో నా హృదయం ఉప్పొంగుతోంది” అని నాగార్జున పేర్కొన్నారు.