సినీనటుడు అక్కినేని నాగార్జున (Nagarjuna) తన కుటుంబంతో కలిసి శ్రీశైల మల్లన్నను దర్శించుకున్నారు. ఇటీవల నాగచైతన్య మరియు శోభిత (Naga Chaitanya-Sobhita) వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా, కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులతో కలిసి నాగార్జున కుటుంబ సభ్యులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా, స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. తర్వాత, అర్చకులు నూతన దంపతులకు వేదాశీర్వచనం పలికారు. తొలుత, ఆలయ మహాద్వారం వద్ద ఆలయ అధికారులు మరియు అర్చకులు వారికి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా తీసిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
శ్రీశైలం మల్లన్న సేవలో తెలుగు సినీ నటుడు అక్కినేని నాగార్జున.. తనయుడు నాగచైతన్య శోభిత దంపతులు.. #NagaChaithanya #NagarjunaAkkineni #ShobithaDhulipala #Srisailam #Temple #AndhraPradesh #HashtagU pic.twitter.com/oOTh75QE4z
— Hashtag U (@HashtaguIn) December 6, 2024
ఇక, నాగచైతన్య-శోభిత పెళ్లి ఫొటోలను ఇటీవల నాగార్జున తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా, మీడియాకు మరియు ఫ్యాన్స్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. “డియర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఫ్యాన్స్… మీ ప్రేమ, ఆశీస్సులు ఈ వేడుకను ప్రత్యేకం చేశాయి. ఈ అందమైన క్షణాల్లో మమ్మల్ని అర్థం చేసుకున్న మీడియాకు ధన్యవాదాలు. కృతజ్ఞతతో నా హృదయం ఉప్పొంగుతోంది” అని నాగార్జున పేర్కొన్నారు.
My heart is overflowing with gratitude. 🙏
To the media, thank you for your understanding and for giving us the space to cherish this beautiful moment. Your thoughtful respect and kind wishes have added to our joy.
To our dear friends, family, and fans, your love and blessings… pic.twitter.com/1rntU4tDQP
— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 5, 2024