హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో ఆర్టీసీ బస్సు (RTC Bus) బీభత్సం సృష్టించింది. హైదర్ షా కోట్ వద్ద ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులోని 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. బస్సు అద్దాలు పగలగొట్టుకొని ప్రయాణీకులు బయటకు వచ్చారు. దింతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదంలో గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read: cracker blast: తమిళనాడులో భారీ పేలుడు.. నలుగురు మృతి