Robbery : ఢిల్లీ సివిక్ సెంటర్‌లో చోరీ.. కంప్యూట‌ర్లు, ఇత‌ర వ‌స్తువులు ఎత్తుకెళ్లిన దొంగ‌

ఢిల్లీ సివిక్ సెంటర్‌లో చోరీ జ‌రిగింది. ఫ్యాక్టరీ లైసెన్సింగ్ డిపార్ట్‌మెంట్ కార్యాలయం నుండి కంప్యూటర్లు, ఇతర వస్తువులను ఓ..

  • Written By:
  • Updated On - December 19, 2022 / 06:49 PM IST

ఢిల్లీ సివిక్ సెంటర్‌లో చోరీ జ‌రిగింది. ఫ్యాక్టరీ లైసెన్సింగ్ డిపార్ట్‌మెంట్ కార్యాలయం నుండి కంప్యూటర్లు, ఇతర వస్తువులను ఓ వ్య‌క్తి దొంగిలించాడు. భవనంలోని 21వ అంతస్తులో ఈ ఘటన చోటుచేసుకుంది. అద్దాలు పగులగొట్టి దొంగ డిపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించినట్లు సమాచారం. వెంటనే రంగంలోకి దిగిన పోలీసు అధికారులు ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 380, 457 కింద ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. దొంగ వద్ద నుంచి కంప్యూటర్లు, ఇతర వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. కార్యాలయంలోని ముఖ్యమైన ఫైళ్లను దొంగిలించిన కోణంలోనూ విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.