ఢిల్లీ సివిక్ సెంటర్లో చోరీ జరిగింది. ఫ్యాక్టరీ లైసెన్సింగ్ డిపార్ట్మెంట్ కార్యాలయం నుండి కంప్యూటర్లు, ఇతర వస్తువులను ఓ వ్యక్తి దొంగిలించాడు. భవనంలోని 21వ అంతస్తులో ఈ ఘటన చోటుచేసుకుంది. అద్దాలు పగులగొట్టి దొంగ డిపార్ట్మెంట్లోకి ప్రవేశించినట్లు సమాచారం. వెంటనే రంగంలోకి దిగిన పోలీసు అధికారులు ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 380, 457 కింద ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. దొంగ వద్ద నుంచి కంప్యూటర్లు, ఇతర వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. కార్యాలయంలోని ముఖ్యమైన ఫైళ్లను దొంగిలించిన కోణంలోనూ విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.