జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో 15 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. కతువాలోని బిల్లావర్ ప్రాంతంలోని సిలా గ్రామం వద్ద మినీ బస్సు డ్రైవర్ అదుపు తప్పి ఢీ కొట్టినట్లు పోలీసులు తెలిపారు. మినీ-బస్సు లోయలో పడిపోవడంతో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా.. 16 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఇందులో గాయపడిన వ్యక్తి ఆసుపత్రికి తీసుకువెళుతుండగా మరణించాడని.. బస్సు మోండ్లీ నుండి ధను పరోల్ గ్రామానికి వెళ్తోందని పోలీసులు తెలిపారు.