కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Supreme) అనర్హతను సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ (petition)దాఖలు అయింది. పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు విధించిన సూరత్ కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంలో పిల్ పడింది. అనర్హత వేటు కోసం ఉన్న ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8(3) చెల్లుబాటును సవాలు చేస్తూ శనివారం పిటిషన్ దాఖలైంది.
సుప్రీం కోర్టు(Petition) గత తీర్పు ఆధారంగా రెండు లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాల జైలు శిక్ష పడితే ఆటోమెటిక్గా ప్రజాప్రతినిధులు అనర్హులు. ఆ మేరకు ఉన్న సెక్షన్ 8 విషయంలో దిశానిర్దేశం చేయాలని సుప్రీంను పిటిషనర్ అభ్యర్థించారు. సదరు సెక్షన్ ఏకపక్షంగా ఉందన్న అభిప్రాయాన్ని పిటిషన్ లో పొందుపరిచారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(3) రాజ్యాంగ చెల్లుబాటును కూడా పిటిషనర్ (Rahul Supreme)ప్రశ్నించారు.
ఈ పిటిషన్ (Petition))ను కేరళకు చెందిన పీహెచ్డీ స్కాలర్, సామాజిక కార్యకర్త ఆభా మురళీధరన్ వేశారు. సెక్షన్ 8(3)ను న్యాయసమ్మతం లేకుండా రూపొందించారని, అది రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేల భావ స్వేచ్ఛను ఆ చట్టం హరిస్తోందని ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలు తమ ఓట్లతో నేతల్ని ఎన్నుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కానీ ఆ చట్టం వల్ల ఆ నేత తన విధుల్ని సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నట్లు వివరించారు. అడ్వకేట్ దీపక్ ప్రకాశ్ ద్వారా పిటిషన్ దాఖలు చేయించారు. మరో అడ్వకేట్ శ్రీరామ్ పరాకట్ కూడా ఆ పిటిషన్లో కొన్ని అభ్యర్థనలు చేశారు. 1951 చట్టంలోని సెక్షన్ 8, 8ఏ, 9, 9ఏ, 10, 10ఏ, 11కు భిన్నంగా సెక్షన్ 8(3) ఉన్నట్లు పిటిషన్లో (Rahul Supreme)పేర్కొన్నారు.
Also Read : Rahul Disqualify : మోడీ,ఆదానీ సంగతి తేల్చుతా : రాహుల్
‘మోదీ’ ఇంటిపేరుపై వ్యాఖ్యల కేసులో సూరత్ కోర్టు రెండు రోజుల క్రితం రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది.అదే సందర్భంలో తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు నెల రోజుల వ్యవధిని ఇచ్చింది. కానీ ఆ తీర్పు వెలుబడిన 24 గంటల్లోపు రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్సభ సచివాలయం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి పోరాటం కాంగ్రెస్ చేస్తోంది.
అనర్హతపై రాహుల్ (Rahul Supreme)మీడియా ముఖంగా స్పందించారు. అదానీ, మోడీ సంబంధాలను బయటపడకుండా అనర్హత వేటు వేశారని ఆరోపించారు. జీవితకాలం అనర్హత వేటు వేసినా మోదీ, ఆదానీ బంధంపై పోరాడతానని వెల్లడించారు. భారత దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఎలాంటి త్యాగానికైనా సిద్దమని అన్నారు. అనర్హతపై భయంపడకుండా పోరాటం కొనసాగిస్తానని చెప్పారు. ఇదే సమయంలో రాహుల్ అనర్హతపై సుప్రీం కోర్టులో పిల్ (Petition)దాఖలు అయింది. అంటే, ఒక వైపు ప్రజాక్షేత్రంలో పోరాడుతూ మరో వైపు న్యాయపోరాటానికి కాంగ్రెస్ పార్టీ దిగింది. దీంతో మోడీ, అదానీ విషయంలో తాడోపేడో తేల్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.
Also Read : Rahul Disqualified : చింపిన ఆర్డినెన్స్ రాహుల్ పై వేటేసింది.!