మహబూబ్నగర్ మండలం గాజులపేటలో దారుణం చోటుచేసుకుంది. మౌనిక(25) మహిళకు అదే గ్రామానికి చెందిన మాధవరెడ్డితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. మౌనిక ప్రస్తుతం ఏడునెలల గర్భిణీతో ఉంది. అయితే మళ్లీ ఆడపిల్ల పుడుతుందేమోనని భయపడ్డ మౌనిక కొద్ది రోజులుగా ఆందోళన చెందుతోంది. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమ యంలో చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.