Love Story: వెలుగులోకి మరో ప్రేమ కథ.. భారత యువకుడిని పెళ్లి చేసుకున్న పాక్ యువతి?

ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రేమ కథలు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఆ ప్రేమ కథలు ఏకంగా దేశాలలో దాటి వెళుతున్నాయి. ఒక దేశానికి చెందిన యువ

  • Written By:
  • Publish Date - August 6, 2023 / 03:20 PM IST

ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రేమ కథలు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఆ ప్రేమ కథలు ఏకంగా దేశాలలో దాటి వెళుతున్నాయి. ఒక దేశానికి చెందిన యువకుడు మరొక దేశానికి చెందిన యువతిని ప్రేమించడం, వేరే దేశానికి చెందిన యువతీ మరొక దేశానికి చెందిన యువకుడిని ప్రేమించిన ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే మొన్నటి వరకు భారత్లో సీమా హైదర్ సచిన్ మీనా ఇలాంటి ప్రేమికుల పేర్లు సోషల్ మీడియాలో మారుమోగిన సంగతి తెలిసిందే.

కాగా ఈ ప్రేమల కారణంగా భారత్ పాకిస్తాన్ ల మధ్య సంబంధం మరింత బలపడింది. ఇప్పటికే సీమా హైదర్, సచిన్ మీనా, అంజు-నస్రుల్లా భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దులను చెరిపేసి తమ ప్రేమను గెలిపించుకోగా తాజాగా అమీనా,అర్బాజ్ ఖాన్ కూడా ఒక్కటై ఈ లిస్టులో చేరిపోయారు. అయితే వీరు సాహసాలకు తెరతీయకుండా పెద్దలను ఒప్పించి ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్నారు. పాకిస్థాన్‌కు చెందిన అమీనాకు భారత్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ అర్బాజ్ ఖాన్‌కు వర్చువల్‌గా వివాహం జరిగింది. వీరిద్దరిదీ పెద్దలు కుదిర్చిన సంబంధమని పాకిస్థాన్‌లో ఉన్న తమ బంధువులు ఈ సంబంధాన్ని మాట్లాడి కుదిర్చినట్లు తెలిపారు అర్బాజ్ ఖాన్.

వాస్తవానికి వివాహం భారత్‌లోనే జరగాలి కానీ అమీనాకు వీసా దొరకకపోవడం వలన ఎవరి దేశాల్లో వారు ఉండిపోయామని అతను చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ తమ నిఖా సంప్రదాయబద్ధంగా పెద్దల సమక్షంలోనే జరిగినట్లు అర్బాజ్ ఖాన్ వెల్లడించారు. భారత్ పాకిస్తాన్ మధ్య సత్సంబంధాలు లేనందునే ఈ విధంగా ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని అమీనాకు వీసా వచ్చిన తర్వాత ఇండియాలో మళ్ళీ వివాహం చేసుకుంటానని తెలిపారు అర్బాజ్. నిఖా మాత్రమే కాదు వివాహానికి సంబంధించిన అన్ని సంప్రదాయాలను దగ్గరుండి జరిపించారు కుటుంబ సభ్యులు. అర్బాజ్ చెప్పినట్లు పాకిస్తాన్ భారతదేశం మధ్య సంబంధాలు సరిగ్గా లేవన్నది ఒకప్పటి మాట. ఈ జంటల కథలను చూస్తే సంబంధాలు మెరుగవుతున్నట్టే కనిపిస్తోంది.