Site icon HashtagU Telugu

Pakistan Opened Fire: ప‌హల్గాం ఉగ్రదాడి.. కాల్పులు ప్రారంభించిన పాకిస్థాన్!

Pakistan-India Ceasefire

Pakistan-India Ceasefire

Pakistan Opened Fire: ప‌హల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ తన చర్యలను ఆపడం లేదు. దారుణమైన ఉగ్రదాడిపై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా.. పాకిస్తాన్ దూకుడు చ‌ర్య‌లు అవ‌లంభిస్తోంది. భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటే పాకిస్తాన్ కూడా సమాధానం ఇవ్వడానికి సిద్ధమైనట్లు ప్రకటించింది. ఈ సమయంలోనే జమ్మూ కాశ్మీర్‌లో నియంత్రణ రేఖ (LoC) వెంబడి కొన్ని ప్రాంతాల్లో పాకిస్తాన్ సైన్యం ఆయుధాలతో కాల్పులు (Pakistan Opened Fire) జరిపింది. భారత సైన్యం కూడా ఈ కాల్పులకు తీవ్రంగా స్పందించింది. అయితే ఈ కాల్పుల్లో ఇరువైపులా ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. కానీ సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది.

భారత సైన్యం అధికారులు కాల్పులను ధృవీకరించారు. కానీ ఇంకా దీనిపై వివరణాత్మక సమాచారం ఇవ్వలేదు. ఇదే సమయంలో LoC వద్ద కాల్పుల మధ్య ఉత్తర కాశ్మీర్‌లోని బందిపోరాలోని కుల్నార్ బాజీపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు- భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతంలో 2 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉగ్రవాదులు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో కొంతమంది గాయపడినట్లు సమాచారం. గత 2 రోజుల్లో బందిపోరాలో సుమారు 7 మంది ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్ తర్వాత అరెస్టు చేశారు. ఫెహల్గామ్ దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో శోధన కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

ఫిబ్రవరిలో కూడా పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపింది

భారత సైన్యం అధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం.. పాకిస్తాన్ సైన్యం సరిహద్దులో చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపింది. మా సైనికులు కూడా ప్రతిస్పందించారు. కానీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇంతకుముందు ఫిబ్రవరిలో కూడా పాకిస్తాన్ సైన్యం పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద ఒక భారత చౌకీపై చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపింది. భారత్ అప్పుడు కూడా ప్రతిస్పందించింది. అప్పట్లో కూడా ఎలాంటి ప్రాణనష్టం లేదా నష్టం జరిగినట్లు సమాచారం లేదు. తాజా కాల్పులు ఫెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జరిగాయి.

Also Read: Fruits: ఈ పండ్లు తిన్న త‌ర్వాత మీరు నీరు తాగుతున్నారా?

హై అలర్ట్‌లో భారత్, పాకిస్తాన్

ఇస్లామాబాద్ జమ్మూ-కాశ్మీర్ ఉగ్ర సంఘటన, ఈ రోజు అరేబియా సముద్రంలో కరాచీ తీరంలో జరగనున్న సంభావ్య క్షిపణి పరీక్ష మధ్య అరేబియా సముద్రం పైన నో-ఫ్లై జోన్‌ను విధించింది. పాకిస్తాన్ భూమి నుంచి భూమిపైకి దాడి చేసే క్షిపణి పరీక్షను నిర్వహిస్తోంది. భారత్ నుంచి ఆందోళనల నేపథ్యంలో పాకిస్తాన్ LoC వద్ద తన వైపు సైన్యాన్ని కూడా మోహరించింది. 17 ఫైటర్ జెట్‌లను మోహరించింది. 20 స్క్వాడ్రన్‌లను అలర్ట్ మోడ్‌లో ఉంచింది. పాకిస్తాన్ భారత్ చర్యలకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది.