కరోనా దెబ్బకు అగ్రరాజ్యం గజగజా వణికిపోతోంది. ఒక సెకనుకు 9 పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. డెల్టా వేరియెంట్ తో పాటు ఓమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 14లక్షల కేసులు నమోదు కావడం గమనార్హం. సెకండ్ వేవ్ సమయంలో అమెరికా భారీగా ప్రాణ నష్టాన్ని చూసింది. ఇప్పుడు కూడా మళ్లీ అదే పరిస్థితి నెలకొంది.దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్లను 100శాతం వేయించింది. బూస్టర్ డోస్ లను కూడా అమెరికా పౌరులు వేయించుకున్నారు. కానీ, డెల్టా వేరియెంట్ వెంటాడుతోంది. ఓమిక్రాన్ కేసులు పెరిగిపోవడంతో అక్కడి ఆస్పత్రులు కరోనా రోగులతో నిండిపోయాయి. పరస్థితిని ఎప్పటికప్పుడు ప్రభుత్వం సమీక్షిస్తోంది. ప్రాణ నష్టాన్ని వీలున్నంత తగ్గించే ప్రయత్నం చేస్తోంది.