జనవరి 27 నుంచి తన పాదయాత్ర ప్రారంభమవుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధికారికంగా ప్రకటించారు. మంగళగిరిలో కార్యకర్తలతో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 400 రోజుల పాటు ఈ పాదయాత్ర కొనసాగుతుందని.. 4 వేల కి.మీ పాదయాత్ర ఉంటుందని లోకేష్ తెలిపారు. ఇటు మంగళగిరిలో 4 రోజుల పాటు పాదయాత్ర ఉంటుందని.. మంగళగిరి బాధ్యతలు కార్యకర్తలు తీసుకోవాలని నారా లోకేశ్ కోరారు.