KTR Case : ఫార్ములా-ఈ కార్ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. అధినేత కేసీఆర్ను బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ట్వీట్టర్ వేదికగా మండిపడ్డారు. అక్రమ కేసులతో మా గొంతులను నొక్కలేరని వెల్లడించారు. చిల్లర వ్యూహాలతో మమ్మల్ని భయపెట్టాలనుకోవడం అవివేకం అని ఆమె తెలిపారు. తెలంగాణ ఉద్యమ పోరాటం నుంచి పుట్టామని అన్నారు. మీ చిల్లర వ్యూహాలు మమ్మల్ని భయపెట్టవు.. అవి మా సంకల్పానికి మరింత బలం చేకూరుస్తాయని అన్నారు.
అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని కవిత అన్నారు. మేమంతా తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన కేసీఆర్ సైనికులమనే విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాలి అక్రమంగా కేసులు పెడుతూ మీరు చేస్తున్న ప్రయత్నాలు మమ్మల్ని భయపెట్టలేవు. మేం మరింత బలపడతాం. సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీలో ప్రతిపక్షాలకు సమాధానం చెప్పలేక కేటీఆర్పై అక్రమంగా, కక్షపూరిత కేసులు పెడుతున్నారని కవిత అన్నారు. మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. తెలంగాణ స్ఫూర్తి గెలుస్తుంది అని కవిత అన్నారు. జై తెలంగాణ ! జై జై తెలంగాణ !! అని కవిత పేర్కొన్నారు.
కాగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై కేసు ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద ఏసీబీ కేసు నమోదు చేసింది. 13(1)A, 13(2) పీసీ యాక్ట్ కింద ఏసీబీ కేసులు నమోదు చేసింది. వాటితో పాటు 409, 120B సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. మొత్తంగా నాలుగు సెక్షన్ల కింద కేటీఆర్పై ఏసీబీ కేసులు నమోదు చేసింది. ఫార్ముల్ ఈ- రేసింగ్ కేసులో.. A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, A3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇండనీర్ బీఎల్ఎస్ రెడ్డిగా ఏసీబీ పేర్కొంది.
Read Also: ChatGPT On Whatsapp: వాట్సాప్లోనూ ‘ఛాట్ జీపీటీ’.. ఎలా వాడుకోవాలో తెలుసా ?