Kamal Haasan: గవర్నర్ పై కమల్ హాసన్ ఆగ్రహం

తమిళనాడు ఎన్నికల ఫలితాల అనంతరం నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనపై విశ్వనటుడు కమల్ హాసన్, ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు. అతిపెద్ద పార్టీగా నిలిచిన విజయ్ టీవీకే పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడంపై కమల్ హాసన్ మండిపడ్డారు. 108 స్థానాలు గెలిచిన విజయ్ కి అవకాశం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని ఆయన పేర్కొన్నారు. నటుడు ప్రకాష్ రాజ్ కూడా గవర్నర్ వైఖరిని తప్పుబడుతూ, ఇది రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకునే అవకాశం విజయ్ కి కల్పించాలని […]

Published By: HashtagU Telugu Desk
Kamal Haasan Outraged at Governor

Kamal Haasan Outraged at Governor

తమిళనాడు ఎన్నికల ఫలితాల అనంతరం నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనపై విశ్వనటుడు కమల్ హాసన్, ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు. అతిపెద్ద పార్టీగా నిలిచిన విజయ్ టీవీకే పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడంపై కమల్ హాసన్ మండిపడ్డారు. 108 స్థానాలు గెలిచిన విజయ్ కి అవకాశం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని ఆయన పేర్కొన్నారు. నటుడు ప్రకాష్ రాజ్ కూడా గవర్నర్ వైఖరిని తప్పుబడుతూ, ఇది రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకునే అవకాశం విజయ్ కి కల్పించాలని వీరు డిమాండ్ చేస్తున్నారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ కు చెందిన టీవీకే పార్టీ అనూహ్యమైన విజయాన్ని సాధించింది. 108 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించినప్పటికీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 118 స్థానాలు లేవంటూ రాష్ట్ర గవర్నర్ జాప్యం చేస్తున్నారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటోన్న పరిణామాలపై సీనియర్ నటుడు, ఎంపీ కమల్ హాసన్ స్పందించారు. టీవీకే పార్టీ అధిక స్థానాల్లో గెలిచినప్పటికీ ఇప్పటి వరకూ ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు పడకపోవడం ప్రజా తీర్పును అగౌరవపరచడమేనని, ఇది రాష్ట్రానికి జరిగిన అవమానమని ఆయన అన్నారు. ఈ విషయంలో గవర్నర్‌ తీరుపై కమల్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

తమిళనాడు శాసనసభ ఎన్నికలలో, ఏ ఒక్క పార్టీకీ స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అధికారాన్ని ప్రజలు కట్టబెట్టలేదు. తమిళనాడు చరిత్రలో ఇటువంటి ఫలితం రావడం ఇదే ప్రథమం. నా సోదరుడు ఎంకే స్టాలిన్ గారు, ‘మేము ప్రజల తీర్పును గౌరవిస్తాము. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తాము’ అని ప్రకటించారు. ఆయన రాజకీయ పరిపక్వతను నేను గౌరవిస్తాను. ప్రస్తుతం రాజ్యాంగ పదవులలో ఉన్నవారు కూడా ఇప్పుడు తమ విధిని నిర్వర్తించాలి. ఇది ఒక డిమాండ్ కాదు, వారి రాజ్యాంగపరమైన బాధ్యతను గుర్తుచేయడం మాత్రమే

విజయ్ గారి నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కజగం’ పార్టీ 108 స్థానాలను గెలుచుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆయనను ఆహ్వానించకపోవడం అనేది, తమిళనాడు ప్రజల తీర్పును అగౌరవపరచడమే అవుతుంది. ఎన్నికైన 233 మంది సభ్యులు ఇప్పటికీ ప్రమాణ స్వీకారం చేయలేకపోతున్నారు. ఇది రాష్ట్రానికి జరిగిన అవమానం; ఇది ప్రజాస్వామ్యానికి కలిగిన నష్టం. ‘మెజారిటీని రాజ్‌భవన్‌లో కాదు, శాసనసభలోనే నిరూపించుకోవాలి’ అని S.R. బొమ్మై కేసులో సుప్రీం కోర్టు స్పష్టంగా పేర్కొంది. నేను మాట్లాడుతున్నది పార్టీ రాజకీయాల గురించి కాదు. ఇది ఒక భారతీయ పౌరుడి విధానపరమైన గళం. తమిళనాడు ప్రజల తీర్పును తప్పక గౌరవించాలి అని కమల్ హాసన్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.

మరోవైపు తమిళనాడు గవర్నర్ వైఖరిని నటుడు ప్రకాష్ రాజ్ తప్పుబట్టారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. విజయ్ కు ప్రజా తీర్పు వచ్చిందని, సభలో మెజారిటీ నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ”గవర్నర్ ప్రవర్తన అత్యంత అసహ్యకరమైనది, ఆమోదయోగ్యం కానిదిరా. ఇది జ్యాంగ విరుద్ధమైనది. మన మధ్య అభిప్రాయ భేదాలు ఉండవచ్చు… కానీ విజయ్ కు ప్రజల తీర్పు లభించింది. సభలో తన హక్కును నిరూపించుకునే అవకాశం అతనికి కల్పించాలి” అని ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్‌ను విజయ్ కలిసిన నేపథ్యంలో ప్రకాష్ రాజ్ తన పోస్ట్‌తో మద్దతు తెలిపారు.

 

  Last Updated: 07 May 2026, 02:15 PM IST