తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన టీవీకే ప్రభుత్వా్న్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ కటాక్షం కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. బుధవారం టీవీకే ప్రతినిధులతో కలిసి గవర్నర్ను కలిసిన విజయ్.. ప్రభుత్వ ఏర్పాటుకు తమ పార్టీని ఆహ్వానించాలని కోరారు. అయినా సరే గవర్నర్ నుంచి సానుకూల స్పందన రాలేదు.
దీంతో గురువారం మరోసారి విజయ్ లోక్ భవన్కు వెళ్లి గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సానుకూలంగా స్పందించాలని అభ్యర్థించారు. అయినా సరే గవర్నర్ నుంచి సానుకూల స్పందన రాలేదని తెలుస్తోంది. 108 సీట్లు ప్లస్ కాంగ్రెస్ మద్దతు ఇచ్చి ఐదు సీట్లతో మెజార్టీని ఎలా నిరూపించుకుంటారని గవర్నర్ విజయ్ను ప్రశ్నించినట్లు సమాచారం.
