Hyderabad: ‘పీజ్ ​​రెయిన్ స్పా’ సెంటర్ పై బంజారాహీల్స్ పోలీసుల దాడి

బంజారాహిల్స్ స్పా సెంటర్ పై బంజారాహీల్స్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు కస్టమర్లను అదుపులోకి తీసుకోగా అందులో పని చేసే ఐదుగురు మహిళలను రక్షించినట్టు పోలీసులు తెలిపారు.

Hyderabad: బంజారాహిల్స్ స్పా సెంటర్ పై బంజారాహీల్స్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు కస్టమర్లను అదుపులోకి తీసుకోగా అందులో పని చేసే ఐదుగురు మహిళలను రక్షించినట్టు పోలీసులు తెలిపారు.

‘పీజ్ ​​రెయిన్ స్పా’ సెంటర్‌లో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఎం నరేంద్ర ఆధ్వర్యంలో పోలీసు బృందం ‘పీజ్ ​​రెయిన్ స్పా’ సెంటర్ పై దాడి చేసింది. ఈ దాడిలో ఐదుగురు కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు. ఒక మేనేజర్‌ని అరెస్టు చేశారు. ఐదుగురు మహిళలను రక్షించినట్లు ఎస్‌హెచ్‌ఓ నరేంద్ర తెలిపారు. సదరు స్పా నిర్వాహకులపై బంజారాహిల్స్ పోలీసులు అనైతిక కార్యకలాపాల చట్టం కింద కేసు నమోదు చేశారు. ‘పీజ్ ​​రెయిన్ స్పా’ సెంటర్‌ బంజారాహీల్స్ రోడ్ నంబర్ 12లో ఉన్నది.

Read More: Earthquake : భూకంపంతో వణుకు.. కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో అలర్ట్