Site icon HashtagU Telugu

Hyderabad: భార్యను కత్తితో గొంతు కోసి దారుణ హత్య…

Hyderabad (37)

Hyderabad (37)

Hyderabad: భార్యను కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేసిన నిందితుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు .ఈ సంఘటన అక్టోబర్ 28న హైదరాబాద్ చంపాపేట్‌లోని దంపతుల నివాసంలో జరిగింది. అరెస్టయిన వ్యక్తిని 23 ఏళ్ల టీ స్టాల్ యజమాని కట్రావత్ ప్రేమ్ కుమార్‌గా గుర్తించారు .

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు వడ్త్యా స్వప్న సురేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తూ నిత్యం గొడవలు పడుతుండేది. అక్టోబర్ 28న ప్రేమ్ కుమార్ డి-మార్ట్ నుండి కత్తిని కొనుగోలు చేసి ఇంటికి వెళ్లాడు. సురేష్‌ను వారి ఇంట్లో గుర్తించిన అతను కోపంతో తన భార్యను బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లాడు. డోర్ లోపలి నుంచి గడియపెట్టి కత్తితో భార్య గొంతు కోశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

Also Read: Hyderabad: నగరంలో 14 మంది ఇన్‌స్పెక్టర్లు బదిలీ

Exit mobile version