కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలతో తెలుగు సినిమా ప్రేక్షకులకు దగ్గరవుతున్న ఉదయ్ శంకర్ హీరోగా శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న కొత్త చిత్రం ప్రారంభమైంది. గురు పవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఉదయ్ శంకర్కు జోడీగా జెన్నిఫర్ హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఈ సినిమా ప్రారంభోత్సవానికి, టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ క్రమంలో ఫస్ట్ క్లాప్ ఇచ్చిన వినాయక్ చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు.
ఇక ఆద్యాత్మిక గురువు శ్రీరామ్ కెమెరా స్విచ్ఛాన్ చేసి, ఈ మూవీ టీమ్కు ఆశిస్సులు అందించారు. అలగే ప్రముఖ నిర్మాత నల్లమలుపు బుజ్జి ఆత్మీయ అతిథిగా విచ్చేసి, చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. థ్రిల్లర్ బ్యాక్డ్రాప్లో పక్కా కమర్షియల్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటులు మధునందన్, పృధ్వీరాజ్ , శ్రీకాంత్ అయ్యాంగార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యూత్ని ఆకట్టుకునే కథా, కథనాలతో సాగే ఈ మూవీ, థియేటర్స్లో ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కల్గిస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది.
“ఇది మా కథష వంటి యునిక్ కాన్సెప్ట్తో సినిమా తీసి ప్రేక్షకులకు ఆకట్టుకున్న గురు పవన్ దర్శకత్వంలో ఈ మూవీ షూటింగ్ ఈ నెల 25 నుండి వైజాగ్లో ప్రారంభమవుతోంది. మొదటి షెడ్యూల్ వైజాగ్లో 20 డేస్ చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ రోజు హైదరాబాద్ పుప్పాలగూడ లోని శివాలయంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. సినిమా కాన్సెప్ట్ గురించి తెలుసుకొని, చిత్ర యూనిట్ను వివి వినాయక్ అభినందిచారు. ఒక అందమైన ప్రేమకథ చుట్టూ, థ్రిల్లింగ్ అంశాలను జోడిస్తూ.. కమర్షియల్ వేలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని దర్శకులు గురు పవన్ తెలిపారు. కాగా ఈ చిత్రాన్ని చి శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ పై అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్నారు.