Gold Rates: పసిడి ప్రియులకు షాక్ ఇచ్చిన ధరలు.. నేడు తులం ఎంత పెరిగిందంటే..?

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Rates) నేడు పెరిగాయి. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర (Gold Rates) రూ.56,300గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,420గా నమోదైంది.

Published By: HashtagU Telugu Desk
Gold Price

Gold Price

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Rates) నేడు పెరిగాయి. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర (Gold Rates) రూ.56,300గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,420గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.79,000కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.

బంగారం, వెండి ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక ఆదివారం (మే 21, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!

Also Read: Adipurush Song: ఆదిపురుష్ నుంచి జైశ్రీరామ్‌ సాంగ్ రిలీజ్.. థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,450 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,570గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.56,800 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,960గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,800 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.61,960 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,420గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,470గా ఉంది.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 75,300 ఉండగా, ముంబైలో రూ.75,300గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.79,000 ఉండగా, కోల్‌కతాలో రూ.75,300గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.79,000 ఉండగా, కేరళలో రూ.79,000గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.79,000 ఉండగా, విజయవాడలో రూ.79,000 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.

  Last Updated: 21 May 2023, 06:49 AM IST