Road Accident: మహారాష్ట్రలో తెలంగాణ వాసులు మృతి

మహారాష్ట్రలో తెలంగాణకు చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు.మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ప్రయాణిస్తున్న వాహనం లోయలో పడి తెలంగాణకు చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందగా,

Road Accident: మహారాష్ట్రలో తెలంగాణకు చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు.మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ప్రయాణిస్తున్న వాహనం లోయలో పడి తెలంగాణకు చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పరత్వాడా-చిఖల్దారా రహదారిపై మోతా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసు సూపరింటెండెంట్ అవినాష్ బర్గల్ పిటిఐకి తెలిపారు. తెలంగాణకు చెందిన ఎనిమిది మంది వాహనంలో ప్రయాణిస్తుండగా, అది లోయలో పడిపోయింది. ఆ సమయంలో పొగమంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు నిర్దారణకు వచ్చారు. బాధితులు జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన చిఖల్‌దారా వైపు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది.వాహనంలో ఉన్న నలుగురు ప్రాణాలు కోల్పోగా, మిగతా వారు గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులను అమరావతిలోని ఆస్పత్రికి తరలించినట్లు ఎస్పీ తెలిపారు.

Also Read: IND vs SL: ఎనిమిదోసారి ఆసియా క‌ప్‌ను ముద్దాడిన భార‌త్