Durgamma Trust Board: ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు!

దుర్గగుడి ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

  • Written By:
  • Publish Date - February 7, 2023 / 01:14 PM IST

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయానికి సంబంధించి ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటైంది. దుర్గగుడి ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 15 మంది సభ్యులతో కూడిన దుర్గగుడి ట్రస్ట్‌ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 15 మంది ట్రస్ట్‌ బోర్డు సభ్యులు చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు. అయితే ఎక్స్‌ అఫిషియయోగా దేవస్థాన ప్రధాన అర్చకుడు ఉండనున్నారు.