Fire Accident : ఢిల్లీలోని ఎల‌క్ట్రానిక్ మార్కెట్‌లో భారీ అగ్ని ప్ర‌మాదం

పాత ఢిల్లీలోని భగీరథ్ ప్యాలెస్ ఎలక్ట్రానిక్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దాదాపు 15 నుంచి 17 అగ్నిమాపక...

  • Written By:
  • Updated On - November 29, 2022 / 10:26 AM IST

ఢిల్లీలోని భగీరథ్ ప్యాలెస్ ఎలక్ట్రానిక్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దాదాపు 15 నుంచి 17 అగ్నిమాపక యంత్రాలు మంట‌ల‌ను అదుపులోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఈ ఘ‌ట‌న‌లో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చేందుకు ఫైర్ సిబ్బంది కృషి చేస్తున్నారని మాజీ ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్థ‌న్ తెలిపారు. అగ్నిమాపక అధికారులు, పోలీసులు సంఘటనా స్థలంలో ఉన్నారని… ఇప్పటి వరకు మంటలు అదుపులోకి రాలేదని ఆయ‌న తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో రెండు అంతస్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని… ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు.