ఢిల్లీలోని ఫతేపూర్ బేరీలోని మాన్స్వరూప్ గార్డెన్లోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురికి కాలిన గాయాలయ్యాయి. క్షతగాత్రులందరినీ చికిత్స నిమిత్తం సఫ్దర్జంగ్ ఆస్పత్రికి తరలించారు. భార్యతో గొడవపడి ఓ వ్యక్తి ఇంటికి నిప్పంటించాడని సమాచారం. కొద్దిసేపటికే మంటలు వ్యాపించడంతో ఇంట్లో ఉన్నవారంతా మంటల్లో చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో దంపతులు, వృద్ధురాలు, ఇద్దరు చిన్నారులకు కాలిన గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
