Delhi : ఢిల్లీ ఫ‌తేపూర్ బేరీలో అగ్నిప్ర‌మాదం..ఐదుగురికి గాయాలు

ఢిల్లీలోని ఫతేపూర్ బేరీలోని మాన్‌స్వరూప్‌ గార్డెన్‌లోని ఓ ఇంట్లో అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో ఇద్దరు

Published By: HashtagU Telugu Desk
4 killed In Fire

Fire

ఢిల్లీలోని ఫతేపూర్ బేరీలోని మాన్‌స్వరూప్‌ గార్డెన్‌లోని ఓ ఇంట్లో అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురికి కాలిన గాయాలయ్యాయి. క్షతగాత్రులందరినీ చికిత్స నిమిత్తం సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రికి తరలించారు. భార్యతో గొడవపడి ఓ వ్యక్తి ఇంటికి నిప్పంటించాడని సమాచారం. కొద్దిసేపటికే మంటలు వ్యాపించడంతో ఇంట్లో ఉన్నవారంతా మంట‌ల్లో చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో దంపతులు, వృద్ధురాలు, ఇద్దరు చిన్నారులకు కాలిన గాయాలయ్యాయి. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

 

  Last Updated: 17 Dec 2022, 11:28 AM IST