Road Accident: ఆంధ్రప్రదేశ్లో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. ఘటన జరిగిన ప్రదేశంలోనే వారు స్పాట్ డెడ్ అయ్యారు. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద జాతీయ రహదారిపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఈ ప్రమాదంలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొంది. దీంతో కారులో ఉన్న ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అయితే ఈ ప్రమాదానికి అతివేగమే కారణమా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. మృతిచెందినవారు తిరుపతి నుండి హైదరాబాద్ కు వెళ్తున్న సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. మృతుల్లో ఇద్దరు మహిళలు కాగా ముగ్గురు పురుషులు కూడా ఉన్నారు. ప్రమాదం గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
We’re now on WhatsApp : Click to Join