Pushpa-3: బన్నీ ఫ్యాన్స్ కు త్రిబుల్ ట్రీట్.. తెరపైకి ‘పుష్ప-3’

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన పుష్ప సినిమా ఎంతపెద్ద హిట్ సాధించిందో అందరికి తెలిసిందే.

  • Written By:
  • Updated On - July 20, 2022 / 02:17 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన పుష్ప సినిమా ఎంతపెద్ద హిట్ సాధించిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్ గా పార్ట్-2 కూడా రాబోతోంది. అయితే కథ డిమాండ్, మెటిరీయల్ కారణంగా పుష్ప-3 కూడా వచ్చిన ఆశ్చర్యపోనకర్లేదు. పుష్ప-3 కూడా వస్తే నిజంగా బన్నీ అభిమానులకు పండుగలాంటిదే. నటుడు ఫహద్ ఫాసిల్ ఇప్పుడు తన రాబోయే చిత్రం ‘మలయంకుంజు’ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నాడు. అయితే ఓ ఇంటర్వ్యూలో ‘పుష్ప: ది రైజ్’ సీక్వెల్‌తో సహా తన ఇతర ప్రాజెక్ట్‌ల వివరాలను కూడా ఫహద్ తెలియజేశాడు.

దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని మొదట్లో పార్ట్-1 మాత్రమే భావించారని ఫహద్ వెల్లడించాడు. “నాకు మొదట ఈ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు, పుష్ప 1 మాత్రమే ఉంది. పార్ట్- 2 లేదు. ఆ (పోలీస్ స్టేషన్ సన్నివేశాలు) సన్నివేశం ఇంటర్వెల్ బ్రేక్‌కి దారితీసింది. ఆపై సినిమాలో నా ప్రమోషన్ వచ్చింది ”అని ఫహద్ చెప్పాడు. అయితే పుష్ప రాజ్ కథ చాలా పెద్దది అని భావించిన సుకుమార్ ప్లాన్ మార్చాడు. సినిమాను రెండుగా విభజించాడు. “సుకుమార్ సార్ (గతంలో) ఎర్రచందనంపై నెట్‌ఫ్లిక్స్ కోసం ఒక సిరీస్ చేయాలనుకున్నారు. ఇటీవల ఆయనతో మాట్లాడినప్పుడు పుష్ప 3కి కూడా స్కోప్ ఉందని చెప్పారు. మా దగ్గర చాలా మెటీరియల్ ఉంది” అని ఫహద్ స్పష్టం చేశారు. తెలుగు తనకు కొత్త భాష కాబట్టి తన లైన్లను కంఠస్థం చేసుకోవడానికి సుకుమార్ తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడని ఫహద్ వెల్లడించాడు. సుకుమార్, అల్లు అర్జున్ ఇద్దరూ తనను బాగా చూసుకున్నారని కూడా ఫహద్ చెప్పాడు.