Simhachalam: విశాఖపట్నంలోని సింహాచలం ఆలయంలోకి గురువారం కుక్క చొరబడింది. అయితే ఇది ఆలయ పవిత్రతను దెబ్బతీసినట్లేనంటూ అధికారులు రెండు గంటల పాటు దర్శనాన్ని నిలిపివేశారు. ఆలయ అర్చకులు సంప్రోక్షణ వ్రతం చేసే వరకు భక్తులు వేచి ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాతే ఆలయాన్ని భక్తుల కోసం తెరిచారు. ఆలయ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే వీధికుక్క ఆలయంలోకి ప్రవేశించిందని భక్తులు ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో సింహాచలం ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. నిత్యం ఎంతో మంది భక్తులు దైవ దర్శనానికి వస్తుంటారు.
Also Read: Winter Foods: చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు తినాల్సిందే..!