ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ నేతల్లో టెన్షన్ ఎక్కువవుతుంది. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్న జగన్ (CM Jagan)..అభ్యర్థుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలో ఏమాత్రం ప్రజా దరణ తక్కువ ఉన్న వారికీ టికెట్ ఇచ్చేదే లేదని తేల్చి చెప్పడమే కాదు..అలాగే చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇప్పటివరకు ఏడు జాబితాలను విడుదల చేసిన అధిష్టానం..చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. దీంతో కొంతమంది పార్టీని వీడగా..మరికొంతమంది మాత్రం ఎంచేయాలా అనే ఆలోచనలో ఉన్నారు. ఈ తరుణంలో డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర (Peedika Rajanna Dora) కీలక వ్యాఖ్యలు చేసారు.
సీఎం జగన్ దయతలిస్తే వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. ‘నా వయసు, ఆరోగ్యం రీత్యా ఎమ్మెల్యేగా పోటీ చేయలేను. అరకు ఎంపీగా పోటీ చేయాలని ఉంది. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా’ అని, సాలూరులో జరిగిన ‘వాలంటీర్లకు వందనం’ కార్యక్రమంలోఈ వ్యాఖ్యలు చేసారు.
Read Also : PM Modi: రాహుల్ గాంధీపై మోడీ ఫైర్, కారణమిదే
