Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటిన కలెక్టర్

  • Written By:
  • Updated On - July 25, 2023 / 05:33 PM IST

బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తోంది. సెలబ్రిటీలు, సామాన్యలు తమవంతుగా మొక్కలు నాటుతున్నారు. తాజాగా గ్రీన్ ఇండియా చాలెంజ్ లో నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు విసిరిన చాలెంజ్ స్వీకరించి  కామారెడ్డి కలెక్టర్ జితేష్ పాటిల్ మొక్కలు నాటారు. అనంతరం జగిత్యాల,వరంగల్,వనపర్తి కలెక్టర్ లకు గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు. ప్రతిఒక్కరూ పచ్చదనం పాటు పడాలని, విధిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ ఎంతో బాగుందన్నారు.