Chandrababu: నాతో వచ్చేదెవరు?

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినూత్న కార్యక్రమానికి పిలుపునిచ్చారు. రేపు ఆగస్టు 15న చంద్రబాబు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు

Chandrababu: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినూత్న కార్యక్రమానికి పిలుపునిచ్చారు. రేపు ఆగస్టు 15న చంద్రబాబు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ బీచ్ రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్దకు టీడీపీ శ్రేణుల్ని ఆహ్వానించారు. అదేరోజు సాయంత్రం ఎంజీఎం గ్రౌండ్స్ లో యువతతో చంద్రబాబు ముఖాముఖి సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సులో చంద్రబాబు యువతను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తెలుగుజాతి భవితవ్యాన్ని తీర్చిదిద్ధేందుకు… 2047 నాటికి దేశాన్ని గ్లోబల్ లీడర్ గా మలిచే వ్యూహాలపై చర్చిస్తారు. ఈ నేపథ్యంలో తనతో కలిసి రావాలని యువతను , మేధావులను ఆహ్వానించారు.

Also Read: Tirumala: టీటీడీ భక్తులకు అలర్ట్.. నడక మార్గంలో మరో 3 చిరుతలు!